Bhatti Vikramarka : మాతో కలిసి నడవండి.. బహుజన శక్తిని చాటి చెప్పండి
- సంక్షేమం , సామాజిక న్యాయం.. కాంగ్రెస్ పాలనలో చారిత్రాత్మక మార్పులు
- బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ దేశానికి మార్గదర్శకాలు
- బీఆర్ఎస్-బీజేపీ కుట్రలకు ప్రజలు బలి కాదన్న భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, 56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, 8 వేల కోట్లతో యువతకు అవకాశాలు, సన్న ధాన్యంపై రూ.500 బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొస్తున్నాయి,” అని అన్నారు.
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
సంక్షేమం ఒక ఎత్తైతే, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాలు మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. “ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన వంటి అంశాలను మేము పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత దశాబ్దాలుగా ఎందరో గొప్ప నాయకులు సాధించలేనివి. మన ప్రభుత్వం ధైర్యంగా, అందరితో చర్చించి, పారదర్శకంగా ఈ లక్ష్యాలను నెరవేర్చింది,” అని విక్రమార్క గర్వంగా చెప్పారు.
ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఇప్పటికే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాం. ఇది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ చేసిన గొప్ప అడుగు,” అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో భూసంస్కరణల వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందుకే దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిందని విక్రమార్క గుర్తు చేశారు. అయితే, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు గతంలో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు రుచించడం లేదని ఆయన విమర్శించారు. “ఈ నిర్ణయాలు వారి అస్తిత్వానికే సవాల్ విసురుతాయి. అందుకే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాయి,” అని ఆయన ఆరోపించారు.
కంచ గచ్చిబౌలి వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నాయి. వారు ఏనుగులు, పులులు తిరుగుతున్నాయని చెప్పినా, ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారు,” అని వ్యాఖ్యానించారు.
చివరగా, బహుజన వర్గాలను చైతన్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “బీసీ కుల సర్వే మీ కోసం, మీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసింది. మాతో కలిసి నడవండి, బహుజన శక్తిని చాటి చెప్పండి,” అని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!