Bhatti Vikramarka : మాతో కలిసి నడవండి.. బహుజన శక్తిని చాటి చెప్పండి
- సంక్షేమం , సామాజిక న్యాయం.. కాంగ్రెస్ పాలనలో చారిత్రాత్మక మార్పులు
- బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ దేశానికి మార్గదర్శకాలు
- బీఆర్ఎస్-బీజేపీ కుట్రలకు ప్రజలు బలి కాదన్న భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, 56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, 8 వేల కోట్లతో యువతకు అవకాశాలు, సన్న ధాన్యంపై రూ.500 బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొస్తున్నాయి,” అని అన్నారు.
Also Read
సంక్షేమం ఒక ఎత్తైతే, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాలు మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. “ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన వంటి అంశాలను మేము పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత దశాబ్దాలుగా ఎందరో గొప్ప నాయకులు సాధించలేనివి. మన ప్రభుత్వం ధైర్యంగా, అందరితో చర్చించి, పారదర్శకంగా ఈ లక్ష్యాలను నెరవేర్చింది,” అని విక్రమార్క గర్వంగా చెప్పారు.
ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఇప్పటికే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాం. ఇది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ చేసిన గొప్ప అడుగు,” అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో భూసంస్కరణల వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందుకే దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిందని విక్రమార్క గుర్తు చేశారు. అయితే, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు గతంలో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు రుచించడం లేదని ఆయన విమర్శించారు. “ఈ నిర్ణయాలు వారి అస్తిత్వానికే సవాల్ విసురుతాయి. అందుకే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాయి,” అని ఆయన ఆరోపించారు.
కంచ గచ్చిబౌలి వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నాయి. వారు ఏనుగులు, పులులు తిరుగుతున్నాయని చెప్పినా, ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారు,” అని వ్యాఖ్యానించారు.
చివరగా, బహుజన వర్గాలను చైతన్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “బీసీ కుల సర్వే మీ కోసం, మీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసింది. మాతో కలిసి నడవండి, బహుజన శక్తిని చాటి చెప్పండి,” అని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!