Bhatti Vikramarka : మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తాం
- కాలుష్య డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు 39 ఎస్టీపీలు మంజూరు చేశాం
- మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉంది
- మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం
- వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : హైటెక్స్లో NEREDCO ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో.. జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాము.. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే అని ఆయన అన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని, కాలుష్య డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు 39 ఎస్టీపీలు మంజూరు చేశామని ఆయన అన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
Cobra In Pillow: దిండులో భారీ నాగు పాము.. గూస్బంప్స్ వీడియో!
Also Read
హైడ్రా అనుమతులు ఇవ్వదు. హైడ్రా పై కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీ వంటి ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇస్తాయని ఆయన అన్నారు. భారతదేశంలో భవిష్యత్తు హైదరాబాద్దే అని, మూసీ పునర్జీవనం, RRR, 30 వేల ఎకరాలలో అద్భుతమైన ఫ్యూచర్ సిటీనీ నిర్మిస్తున్నాం. ఎయిర్ పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, AI ప్రాజెక్టులు చేపడుతున్నాం. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. రియటర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై మేము మాట్లాడం.. త్వరలో SLBC సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మూలంగా రిజిస్ట్రేషన్లలో స్తబ్దత ఏర్పడింది.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయన్నారు భట్టి విక్రమార్క.
MLA Brahmananda Reddy: నాపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. జూలకంటి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!