Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.
Accident: ఓవర్టేక్ చేస్తూ బైక్, ఆటోని ఢీకొట్టిన స్కార్పియో.. ఏడుగురు దుర్మరణం..
Also Read
- Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
- OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
- WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భావనతో గత 7 ఏండ్లుగా భారతమాతకి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా హారతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమం.. ఇది ఏ సంస్థకు చెందింది కాదని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా మహా హారతి కార్యక్రమంను ఆనవాయితీగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేయడానికి భారతమాత ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్లో 200 మంది పిల్లలు మృతి..
అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. భాగ్యనగరంలో భారతమాతకి మహా హారతి 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశం వారు దేశాన్ని తండ్రిగా భావిస్తారు.. కానీ మన దేశంలో తల్లిగా భావిస్తామని అన్నారు. మన దేశంలో మాతృభూమికి అంతటి గొప్పతనం ఉంది.. వేరే ఇతరులకు ఆ సాంస్కృతి లేదని పేర్కొన్నారు. మనం భారతీయులుగా ఉండడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. భారత భూమికి భారత మాత మృతికకు ఉండే గొప్పతనం అని తెలిపారు. భారత దేశానికి రెండు గొప్పతనాలు ఉన్నాయి. ఒకటి మట్టికి పరిమళం.. ఇంకోటి రుచి ఉన్నది మట్టిలోనని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను ఇక్కడి మట్టిలో ఉన్న పరిమళం మరి ఎక్కడ లేదన్నారు. మన మట్టిలో పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ, రుచి, మంచి పనులు చేయాలనే పరిమళం ఉంటుందని చినజీయర్ అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Mrunal Thakur: డీప్ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
-
October Movies : దసరాపై కర్చీఫ్ వేసిన మెగాస్టార్.. సూపర్స్టార్.. సోలోగా వస్తున్న వెంకీ మామ
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
ట్రెండింగ్
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!