Betting on Elections: ఎన్నికల వేళ వేల కోట్లలో బెట్టింగులు.. ఆ నియోజకవర్గాలపై బెట్టింగా రాయుళ్ల ఫోకస్..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting on Elections: దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
మంగళగిరిలో గెలిచేదెవరు..? కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు..? భీమిలిలో పరిస్థితి ఏంటి..? ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్లో బెట్టింగులు జరుగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే.. పులివెందులలో మాత్రం ఏపీ సీఎం జగన్కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
ఇక, కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి.. మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైనా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో.. బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి.. గెలిచినవారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్కు వందకు 2.5 శాతం కమీషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటోంది. కొన్నిచోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి.. మరి కొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు.. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిష నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతుంది. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అని చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!