Betting on Elections: ఎన్నికల వేళ వేల కోట్లలో బెట్టింగులు.. ఆ నియోజకవర్గాలపై బెట్టింగా రాయుళ్ల ఫోకస్..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting on Elections: దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
మంగళగిరిలో గెలిచేదెవరు..? కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు..? భీమిలిలో పరిస్థితి ఏంటి..? ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్లో బెట్టింగులు జరుగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే.. పులివెందులలో మాత్రం ఏపీ సీఎం జగన్కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ఇక, కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి.. మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైనా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో.. బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి.. గెలిచినవారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్కు వందకు 2.5 శాతం కమీషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటోంది. కొన్నిచోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి.. మరి కొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు.. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిష నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతుంది. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అని చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?