Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం.. 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
- మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం..
- 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
- పోలీసులు పట్టుకోవడానికి ముందే సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మి(29) హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు రోజు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడని, అతడిని పట్టుకునే పనిలోనే ఉన్నామని చెప్పారు. ఒడిశాలో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూర్ నుంచి పోలీస్ టీంలు వెళ్లాయి. మూడు నుంచి నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లినప్పటి నుంచి నిందితుడు తన స్థలాలను మారుస్తూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగూ పోలీసులకు చిక్కుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
Read Also: Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం.. 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
ముక్తి రంజన్ మంగళవారం సొంతూరు ఒడిశాలోని భద్రక్ జిల్లా ఫండి గ్రామానికి వచ్చాడు. గత రాత్రి ఇంటి నుంచి స్కూటర్పై బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం కూలేపాడు శ్మశాన వాటిక సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ల్యాప్ టాప్ స్కూటర్లోనే ఉండిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం దుషిరి పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తుంది.
సెప్టెంబర్ 22న మహాలక్ష్మీ తన నివాసంలో అత్యంత దారుణంగా హత్య చేయబడింది. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి, 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మహాలక్ష్మీకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, హేమంత్ దాస్ తన భార్యకు అష్రాఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అతడి పైనే అనుమానం ఉందంటూ ఆరోపించాడు. తాజాగా విచారణలో మహాలక్ష్మీతో పనిచేసే ముక్తి రంజన్ రాయ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. తీరా అతడిని పట్టుకునేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!