ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: HYDRA: నాలాలు పొంగొద్దు.. వరద ముంచెత్తొద్దు
బాధితుడి కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్కు వచ్చారు. ఒక కప్పు కాఫీ కొన్నారు. అదనంగా మరో ఖాళీ కప్పు కావాలని అడిగారు. ఉద్యోగి మర్యాదగా నిరాకరించి, మరో కప్పు కాఫీ కొనమని కోరాడు. దీంతో ఆ కస్టమర్లు ఉద్యోగిపై దుర్భాషలాడారు. అందులో ఓ కస్టమర్ ఉద్యోగిని తల, ముఖంపై కొట్టి, కడుపులో తన్నాడు. మిగతా వ్యక్తులు కూడా బాధితుడిపై ఘోరంగా దాడి చేశారు. కాఫీ షాపులో ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీని చూసిన నెటిజన్లు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Bengaluru takes its filter coffee very seriously!
Scuffle breaks out at Namma Filter Coffee in Sheshadripuram after a customer, denied an extra empty cup, thrashed the cashier
For the record extra cup is chargeable! Also this customer can't handle filter coffee. Someone please… pic.twitter.com/aaBLsVSSQG
— Nabila Jamal (@nabilajamal_) July 3, 2025
