Bengaluru Stadium: బీసీసీఐకి షాక్.. బెంగళూరులో ప్రపంచకప్ కష్టమే?
- మైసూరులో మహారాజా ట్రోఫీ టీ20 లీగ్
- చిన్నస్వామి తొక్కిసలాటపై కొనసాగుతున్న దర్యాప్తు
- బెంగళూరులో ప్రపంచకప్ కష్టమే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s World Cup 2025 matches in doubt at Chinnaswamy Stadium: 2025 మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11 నుంచి 28 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లీగ్ జరగాల్సి ఉంది. అయితే మహారాజా ట్రోఫీ నిర్వహణకు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) వేదికను మైసూరుకు తరలించింది. ఆగస్టు 11 నుంచి నాలుగో సీజన్ మైసూరులో జరగనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ అనంతరం చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రోఫీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలిచిన విషయం తెలిసిందే. జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్సీబీపై కేసు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ను కేఎస్సీఏ మైసూరుకు తరలించింది.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Also Read: Haider Ali: యువతిపై అత్యాచారం.. మ్యాచ్ మధ్యలోనే పాక్ స్టార్ క్రికెటర్ అరెస్ట్!
2025 మహిళల వన్డే ప్రపంచకప్ వచ్చే నెల 30న ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడ మ్యాచ్లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. దాంతో మహిళల వన్డే ప్రపంచకప్ బెంగళూరులో జరగడం అనుమానంగా మారింది. ఒకవేళ ప్రపంచకప్ మ్యాచ్లకు అనుమతి లభించకపోతే.. మరో వేదికకు మ్యాచ్లను తరలించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం