Ranji Trophy 2026: తొలి రంజీ ట్రోఫీ ఫైనల్ అంచున జమ్మూ కాశ్మీర్.. బెంగాల్ నడ్డి విరిచిన జమ్మూ బౌలర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్రాత్మక విజయానికి చేరువైంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ క్రికెట్ టీంపై జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఇక విజయానికి వారికి కేవలం 83 పరుగులు మాత్రమే అవసరం.
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
Also Read
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- CM Chandrababu: సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ఇక ఈ మ్యాచ్ లో మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 328 పరుగులు చేసింది. ఇందులో సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో అద్భుత శతకం సాధించగా.. అతనికి తోడుగా అభిమన్యు ఈశ్వరన్ 49 పరుగులు చేశాడు. ఇక జమ్మూ కాశ్మీర్ బౌలర్ అక్విబ్ నబీ ఐదు వికెట్లు తీసి బెంగాల్ను కట్టడి చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది. ఇందులో అబ్దుల్ సమద్ 82 పరుగులతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ ఇన్నింగ్స్లో భారత పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు.
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
ఇక రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్ల దాడికి 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకు ఆలౌట్ అయింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అక్విబ్ నబీ, సునీల్ కుమార్ చెరో నాలుగు వికెట్లు తీసి బెంగాల్ బ్యాటింగ్ను దెబ్బతీశారు. దీంతో జమ్మూ కాశ్మీర్కు 126 పరుగుల సులభ లక్ష్యం లభించింది. లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. శుభమ్ పుండిర్ 23 పరుగులతో, వంశాజ్ శర్మ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకుంటే జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?