Ranji Trophy 2026: తొలి రంజీ ట్రోఫీ ఫైనల్ అంచున జమ్మూ కాశ్మీర్.. బెంగాల్ నడ్డి విరిచిన జమ్మూ బౌలర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్రాత్మక విజయానికి చేరువైంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ క్రికెట్ టీంపై జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఇక విజయానికి వారికి కేవలం 83 పరుగులు మాత్రమే అవసరం.
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఇక ఈ మ్యాచ్ లో మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 328 పరుగులు చేసింది. ఇందులో సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో అద్భుత శతకం సాధించగా.. అతనికి తోడుగా అభిమన్యు ఈశ్వరన్ 49 పరుగులు చేశాడు. ఇక జమ్మూ కాశ్మీర్ బౌలర్ అక్విబ్ నబీ ఐదు వికెట్లు తీసి బెంగాల్ను కట్టడి చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది. ఇందులో అబ్దుల్ సమద్ 82 పరుగులతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ ఇన్నింగ్స్లో భారత పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు.
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
ఇక రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్ల దాడికి 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకు ఆలౌట్ అయింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అక్విబ్ నబీ, సునీల్ కుమార్ చెరో నాలుగు వికెట్లు తీసి బెంగాల్ బ్యాటింగ్ను దెబ్బతీశారు. దీంతో జమ్మూ కాశ్మీర్కు 126 పరుగుల సులభ లక్ష్యం లభించింది. లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. శుభమ్ పుండిర్ 23 పరుగులతో, వంశాజ్ శర్మ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకుంటే జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!