BBL Match in India: భారత్ లోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (BBL) వచ్చే సీజన్లో ఓ లీగ్ మ్యాచ్ ను భారత్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) స్టేడియం ప్రతిపాదనకు ప్రధాన వేదికగా నిలుస్తున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ విషయమై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)లోని ఒక సీనియర్ అధికారి ప్రకారం.. ఈ విషయంలో ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ, ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు.
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
క్రికెట్ ఆస్ట్రేలియా (CA) బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ ఫిల్ రిగ్బీ, కాంపిటిషన్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజీ హెడ్ మార్గోట్ హార్లీ ఇటీవల భారత్కి వచ్చి వేదికలు, లాజిస్టిక్స్పై పరిశీలన (రెక్కీ) నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన చెపాక్ స్టేడియం గురించి మంచి అభిప్రాయాలు విన్నారు. అయితే ఇది మాత్రమే పరిశీలనలో ఉన్న వేదిక మాత్రమే. బీసీసీఐ నుంచి అధికారిక ఆదేశాలు వచ్చినప్పుడే TNCA తుది నిర్ణయం తీసుకోగలదు. ఈ ప్రతిపాదనపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా వద్దా అన్నది తుది నిర్ణయం బీసీసీఐదే అని ఆ అధికారి తెలిపారు.
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!
బిగ్ బాష్ లీగ్ ప్రపంచంలోని ప్రముఖ టీ20 లీగ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. పెర్త్ స్కార్చర్స్ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2025-26 సీజన్ ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ను ఓడించి ఆరో టైటిల్ను కైవసం చేసుకుంది. మొత్తం టీ20 టైటిల్స్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీలకన్నా ముందంజలో ఉంది.