Bengal Governor: బెంగాల్ గవర్నర్ పై మహిళ లైంగిక ఆరోపణలు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Governor: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గవర్నర్ లైంగిక వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో గురువారం బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను చూపించారు. గత నెల 24న, ఈ నెల 2వ తేదీన తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు కాంట్రాక్టు మహిళా సిబ్బంది గత శుక్రవారం కోల్కతా పోలీసులకు రాతపూర్వక కంప్లైంట్ చేసింది.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులకు, పోలీసులకు మినహాయించి సాధారణ పౌరులందరికీ చూపిస్తానంటూ గవర్నర్ బోస్ బుధవారం చెప్పారు. అయితే, దాదాపు గంటన్నరసేపు ఉన్న సీసీ ఫుటేజీలో మహిళ నీలం రంగు జీన్స్, టాప్తో రాజ్భవన్ ప్రాంగణంలోని పోలీస్ అవుట్ పోస్టు వైపు వెళ్తున్నట్లు అందులో కనిపించింది. కాగా, సీసీటీవీ ఫుటేజీ చూడటానికి దాదాపు 92 మంది ఆసక్తి కనబరిచినా.. కొందరు మాత్రమే హాజరయ్యారు. ఈ సంఘటనపై ప్రజలే ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. సీసీ ఫుటేజీని చూసిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ తుషార్ కాంతి ముఖర్జీ.. మహిళ ప్రవర్తనలో ఎక్కడా అసాధారణత కనిపించలేదన్నారు.
Read Also: Sam Curran: చాలా బాధగా ఉంది.. మమల్ని క్షమించండి: సామ్ కరన్
అయితే, ఈ వీడియోను రాజ్ భవన్ విడుదల చేయడంపై బాధిత మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనతో పాటు తన కుటుంబం పరువు పోయిందని ఫిర్యాదు చేసిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా నా వీడియోను గవర్నర్ విడుదల చేశారంటూ మండిపడింది. దీంతో నా ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కరెక్టుగా విచారణ జరిపితే, నిజం బయటపడుతుంది అని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!