Bengal Governor: బెంగాల్ గవర్నర్ పై మహిళ లైంగిక ఆరోపణలు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Governor: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గవర్నర్ లైంగిక వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో గురువారం బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను చూపించారు. గత నెల 24న, ఈ నెల 2వ తేదీన తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు కాంట్రాక్టు మహిళా సిబ్బంది గత శుక్రవారం కోల్కతా పోలీసులకు రాతపూర్వక కంప్లైంట్ చేసింది.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇక, ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులకు, పోలీసులకు మినహాయించి సాధారణ పౌరులందరికీ చూపిస్తానంటూ గవర్నర్ బోస్ బుధవారం చెప్పారు. అయితే, దాదాపు గంటన్నరసేపు ఉన్న సీసీ ఫుటేజీలో మహిళ నీలం రంగు జీన్స్, టాప్తో రాజ్భవన్ ప్రాంగణంలోని పోలీస్ అవుట్ పోస్టు వైపు వెళ్తున్నట్లు అందులో కనిపించింది. కాగా, సీసీటీవీ ఫుటేజీ చూడటానికి దాదాపు 92 మంది ఆసక్తి కనబరిచినా.. కొందరు మాత్రమే హాజరయ్యారు. ఈ సంఘటనపై ప్రజలే ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. సీసీ ఫుటేజీని చూసిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ తుషార్ కాంతి ముఖర్జీ.. మహిళ ప్రవర్తనలో ఎక్కడా అసాధారణత కనిపించలేదన్నారు.
Read Also: Sam Curran: చాలా బాధగా ఉంది.. మమల్ని క్షమించండి: సామ్ కరన్
అయితే, ఈ వీడియోను రాజ్ భవన్ విడుదల చేయడంపై బాధిత మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనతో పాటు తన కుటుంబం పరువు పోయిందని ఫిర్యాదు చేసిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా నా వీడియోను గవర్నర్ విడుదల చేశారంటూ మండిపడింది. దీంతో నా ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కరెక్టుగా విచారణ జరిపితే, నిజం బయటపడుతుంది అని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..