Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Before The Assembly Elections In Ap The Rajya Sabha Elections Turned Juicy

Rajyasabha Elections: ఏపీలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు..

Published Date :January 29, 2024 , 6:35 pm
By Rajesh Veeramalla
Rajyasabha Elections: ఏపీలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఇదే సమయంలో నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఈరోజు స్పీకర్ ముందుకొచ్చాయి. కాగా.. వీరిపై వేటుపడితే ఓట్ల లెక్కలు తారుమారుకానున్నాయి. వీటికి తోడు వైసీపీ సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ లెక్క ప్రకారం.. మూడు వైసీపీ ఖాతాలో పడతాయి.. కానీ, టీడీపీ పోటీ పెడితే ఆ పార్టీ అభ్యర్థికి వైసీపీ అసంతృప్తి ఎమ్మె్ల్యేలు ఎవరైనా మద్ధతిస్తే ఫలితాలు తారుమారు అవుతాయి.

Also Read

  • Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
  • Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
  • Veg Pulao Recipe: లంచ్ బాక్స్‌కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
  • Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!

Read Also: Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు

గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు చేజార్చుకున్న వైసీపీ.. ఈసారి ఆ తప్పు దొర్లకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాపురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు, వైవీ సుబ్బారెడ్డి పేర్లును వైసీపీ దాదాపు ఖరారు చేసింది. అయితే పార్టీకి అసంతృప్తి ఎమ్మె్ల్యేల టెన్షన్ పట్టుకుంది. ఇటీవలే మార్పులు-చేర్పులు భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. కొందరు అసంతృప్తి ఎమ్మె్ల్యేలు ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారు. అయితే పార్టీ ఫిరాయించకుండా ఉండి చివరి నిమిషంలో విప్ దిక్కరిస్తే పరిస్థితి ఏందనే ఆందోళనలో ఉంది వైసీపీ.

ఇటు టీడీపీ ఒక్కసీటు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తోంది. మాజీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీతో టచ్ లోకి వచ్చారని సమాచారం తెలుస్తోంది. ఈ ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగే, రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్ ఇస్తామని అంటుంది టీడీపీ. కాగా.. రాజ్యసభ స్థానం దక్కాలంటే 43 ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని టీడీపీ అంచనా వెస్తోంది. ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ బలం 23కు చేరింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఆ సంఖ్య 19కు చేరుతుంది. వైసీపీ రెబల్స్ పై అనర్హత వేటు పడితే దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని లెక్కలు వేసుకుంటుంది. అయితే ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ చెబుతుంది. వైసీపీ అసంతృప్తి ఎమ్మె్ల్యేలే తమను గెలిపిస్తారని పేర్కొంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections
  • Rajya Sabha Elections
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..

  • Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!

  • Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!

  • Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్‌.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!

  • Veg Pulao Recipe: లంచ్ బాక్స్‌కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions