T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Meeting on T20 World Cup 24 Today: టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక కోసం కౌంట్డౌన్ మొదలైంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో.. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తునాయి. ఈ ఊహాగానాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 1న ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నేడు సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.
భారత జట్టును ఎంపిక చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్లు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఇటీవల ముంబై, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా దేశ రాజధానిలో ఓసారి సమావేశం కాగా.. ఆదివారం (ఏప్రిల్ 28) కూడా రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక నేడు అహ్మదాబాద్లో జరిగే సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ జట్టుపై తుది నిర్ణయం తీసుకోనుంది. టీ20 ప్రపంచకప్ కోసం వెళ్లే 15 మంది ఎవరనేది ఇప్పటికే ఖరారైందని తెలుస్తోంది. కేవలం ఐపీఎల్ 2024 ప్రదర్శన మాత్రమే కాకుండా.. అంతకుముందు ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారట.
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
Also Read: Rishabh Pant: మేం దారుణంగా విఫలమయ్యాం.. ప్రతీ రోజు మనది కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్ 2024లో పరుగుల వరదకు కారణమవుతున్న పిచ్లకు పూర్తి భిన్నంగా అమెరికా, వెస్టిండీస్లలో పిచ్లు ఉంటాయి. విండీస్ పిచ్లు మందకొడిగా ఉంటాయి. దాంతో లీగ్లో బాగా ఆడుతున్న కొందరికి జట్టులో చోటు దక్కకపోవచ్చు. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభించడం దాదాపు ఖాయం. దీంతో గిల్కు అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరికైనా గాయమైతే విరాట్ కోహ్లీ ఓపెనర్గా మారతాడు. కీపర్గా రిషబ్ పంత్, సంజు శాంసన్లు ఎంపికయ్యే అవకాశాలు మెండు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులో ఉండడం ఖాయం. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ యాదవ్ పేస్తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఫిట్నెస్ అడ్డంకిగా మారింది. మెగా టోర్నీ కోసం భారత తొలి బృందం మే 21న బయల్దేరనుంది.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!