T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Meeting on T20 World Cup 24 Today: టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక కోసం కౌంట్డౌన్ మొదలైంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో.. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తునాయి. ఈ ఊహాగానాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 1న ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నేడు సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.
భారత జట్టును ఎంపిక చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్లు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఇటీవల ముంబై, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా దేశ రాజధానిలో ఓసారి సమావేశం కాగా.. ఆదివారం (ఏప్రిల్ 28) కూడా రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక నేడు అహ్మదాబాద్లో జరిగే సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ జట్టుపై తుది నిర్ణయం తీసుకోనుంది. టీ20 ప్రపంచకప్ కోసం వెళ్లే 15 మంది ఎవరనేది ఇప్పటికే ఖరారైందని తెలుస్తోంది. కేవలం ఐపీఎల్ 2024 ప్రదర్శన మాత్రమే కాకుండా.. అంతకుముందు ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారట.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Rishabh Pant: మేం దారుణంగా విఫలమయ్యాం.. ప్రతీ రోజు మనది కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్ 2024లో పరుగుల వరదకు కారణమవుతున్న పిచ్లకు పూర్తి భిన్నంగా అమెరికా, వెస్టిండీస్లలో పిచ్లు ఉంటాయి. విండీస్ పిచ్లు మందకొడిగా ఉంటాయి. దాంతో లీగ్లో బాగా ఆడుతున్న కొందరికి జట్టులో చోటు దక్కకపోవచ్చు. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభించడం దాదాపు ఖాయం. దీంతో గిల్కు అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరికైనా గాయమైతే విరాట్ కోహ్లీ ఓపెనర్గా మారతాడు. కీపర్గా రిషబ్ పంత్, సంజు శాంసన్లు ఎంపికయ్యే అవకాశాలు మెండు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులో ఉండడం ఖాయం. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ యాదవ్ పేస్తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఫిట్నెస్ అడ్డంకిగా మారింది. మెగా టోర్నీ కోసం భారత తొలి బృందం మే 21న బయల్దేరనుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?