T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024.. భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Squad for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి టోర్నీ జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు మే 1 లోపు టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. టీమ్స్ ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్లైన్గా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు త్వరలోనే జట్లను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు ఎంపికకు బీసీసీఐ కూడా ముహూర్తం ఖరారు చేసిందని తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏప్రిల్ 28న ముంబైలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుందట. ఈ సమావేశంలో ఓపెనర్, వికెట్ కీపర్, పేస్ బౌలర్లపై ప్రత్యేక చర్చ జరగనుందట. ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని దించాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తుందట. ఐపీఎల్ 2024లో గిల్, యశస్వి రాణించడకపోవడమే ఇందుకు కారణం.
Also Read
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
- Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
- IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు..
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
Also Read: DC vs SRH: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఫ్రేజర్-మెక్గర్క్.. ఏకంగా మూడు రికార్డ్స్!
వికెట్ కీపర్ రేసులో ముందు వరుసలో ఉన్న జితేష్ శర్మ ఐపీఎల్ 2024లో రాణించకపోవడం బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. జితేష్ స్ధానంలో దినేష్ కార్తీక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ పేర్లను పరిశీలిస్తున్నారట. డీకే, సంజూలకే జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో పాటు మూడో పేసర్గా అర్ష్దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, వైభవ్ అరోరాలు రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ ఎంపిక కానున్నారు. సూర్య, జడేజా, రాహుల్, శివమ్, హార్దిక్ జట్టులో ఉండనున్నారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!