BCCI chief: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 70వ వార్షికోత్సవానికి హాజరైన రోజర్ బిన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 70వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సేవలను కొనియాడారు. క్రికెట్ కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ తన రంజీ ట్రోఫీ రోజులను గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో ఆంధ్ర జట్టుతో ఆట ఆడినప్పుటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
Read Also: Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
భారత్ లో అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీల్లో హాట్ ఫేవరేట్ భారత్ నే బరిలోకి దిగుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ప్రతి భారతీయుడి ఆశ అదే.. 1983లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడం నాకు మధుర జ్ఞాపకమే అని ఆయన పేర్కొన్నారు. 1975 లో విశాఖలో మ్యాచ్ అడాను, మౌళిక సదుపాయాల పరంగా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అన్నారు. ఏళ్ల తరబడి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను అభివృద్ధి చేయడం అభినందనీయమని రోజర్ బిన్నీ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమమైన క్రికెట్కు మంచి మౌలిక సదుపాయాలను కల్పించినందుకు ఏసీఏ గర్వపడాలి అని బీసీసీఐ చీఫ్ బిన్నీ అన్నాడు.
Read Also: Siva Nirvana: ‘ఖుషి’లో వింటేజ్ సమంతను చూస్తారు.. వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం!
ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు మాజీ భారత క్రికెటర్ మదన్ లాల్, మాజీ రంజీ క్రీడాకారులు, మాజీ మహిళా సీనియర్ క్రీడాకారులు, ఏసీఏ సిబ్బంది- కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భవిష్యత్తులో వారు దేశం కోసం ఆడతారని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు. ప్రతిభావంతులైన, వర్ధమాన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఏసీఏ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!