BCCI chief: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 70వ వార్షికోత్సవానికి హాజరైన రోజర్ బిన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 70వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సేవలను కొనియాడారు. క్రికెట్ కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ తన రంజీ ట్రోఫీ రోజులను గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో ఆంధ్ర జట్టుతో ఆట ఆడినప్పుటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
Read Also: Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
భారత్ లో అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీల్లో హాట్ ఫేవరేట్ భారత్ నే బరిలోకి దిగుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ప్రతి భారతీయుడి ఆశ అదే.. 1983లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడం నాకు మధుర జ్ఞాపకమే అని ఆయన పేర్కొన్నారు. 1975 లో విశాఖలో మ్యాచ్ అడాను, మౌళిక సదుపాయాల పరంగా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అన్నారు. ఏళ్ల తరబడి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ను అభివృద్ధి చేయడం అభినందనీయమని రోజర్ బిన్నీ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమమైన క్రికెట్కు మంచి మౌలిక సదుపాయాలను కల్పించినందుకు ఏసీఏ గర్వపడాలి అని బీసీసీఐ చీఫ్ బిన్నీ అన్నాడు.
Read Also: Siva Nirvana: ‘ఖుషి’లో వింటేజ్ సమంతను చూస్తారు.. వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం!
ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు మాజీ భారత క్రికెటర్ మదన్ లాల్, మాజీ రంజీ క్రీడాకారులు, మాజీ మహిళా సీనియర్ క్రీడాకారులు, ఏసీఏ సిబ్బంది- కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భవిష్యత్తులో వారు దేశం కోసం ఆడతారని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు. ప్రతిభావంతులైన, వర్ధమాన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఏసీఏ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!