IPL 2025: తిక్కకుదిరింది.. గ్రౌండ్ లో గొడవ.. దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
- దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
- దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా
- అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దిగ్వేష్ సింగ్ రాఠి అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా విధించింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
Also Read:Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ట్రంప్ ప్రకటన తర్వాత జెలెన్స్కీ వ్యాఖ్య
Also Read
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ఐపీఎల్ అధికారిక మీడియా అడ్వైజరీ ప్రకారం.. ఎల్ఎస్జీ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాటి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ఒక మ్యాచ్ సస్పెన్షన్ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్లో రాఠి చేసిన మూడవ లెవల్ 1 నేరం (ఆర్టికల్ 2.5 ప్రకారం). దీనికి ముందు రెండుసార్లు ఫైన్ విధించారు. మూడు మ్యాచ్ల్లో మొత్తం 5 డీమెరిట్ పాయింట్లు సాధించిన తర్వాత, రాఠి ఇప్పుడు మే 22న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Also Read:NTR Birthday : తారక్ బర్త్ డే సందర్భంగా.. మోత మోగిపోతున్న సోషల్ మీడియా
మరోవైపు, రాఠితో వాదించినందుకు అభిషేక్ శర్మపై కూడా బీసీసీఐ చర్య తీసుకుంది. ఎస్ఆర్ హెచ్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అతనిపై లెవల్ 1 నేరం (ఆర్టికల్ 2.6) కింద అభియోగం మోపబడింది. అయితే, ఇది అతని మొదటి ఉల్లంఘన కాబట్టి, అతనికి 1 డీమెరిట్ పాయింట్ మాత్రమే వచ్చింది. రెండు సందర్భాలలోనూ, లెవల్ 1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!