BC Janardhan Reddy: నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నా.. నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banaganapalli: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజక వర్గంలోని కొండపేటలోని చార్ కమాన్ మస్జీద్ కి సంబందించి, అసంపూర్తిగా ఉన్న కాంప్లెక్స్ ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, బీసీ రాజారెడ్డి గార్ల సహకారంతో 3 లక్షల రూపాయల సొంత నిధులతో 3 గదుల కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
Read Also: Vishnuvardhan Reddy: 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశా.. అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ..!
Also Read
ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. కొందరు కావాలనే నాపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. నా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: Raashi Khanna: బ్లూ డ్రెస్సులో రాశి ఖన్నా అదిరిపోయే స్టిల్స్..
ఇక, బనగానపల్లె నియోజకవర్గంలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై.. వారి కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వినూత్నంగా బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు.. ప్రజలకు సేవ చేయడమే కాదు.. లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నిరూపించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..