Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్లో షాకింగ్ ట్విస్ట్..
Extramarital Affair: ఒకవైపు అందమైన కుటుంబం, మంచి ఉద్యోగం చేసే భర్త, ఇద్దరు పిల్లలు.. బయటికి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఆ కుటుంబంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ రాకతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ప్రియుడి కోసం భర్తను హతమార్చడానికి కూడా వెనుకాడని ఒక భార్య ఉదంతం ఇప్పుడు రాజస్థాన్లో చర్చనీయాంశమైంది. అసలు ఏమైందంటే.. రాజస్థాన్లోని అల్వార్కు చెందిన అర్చన అరోరాకు 2018లో జైపూర్లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అర్ణవ్ ఖత్రీతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్లో ఉండగా, అర్చన అల్వార్లో ఉండేది. అల్వార్ నుంచి జైపూర్కు వెళ్లే క్రమంలో ఆమెకు రిషబ్ శర్మ అనే ట్యాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
READ ALSO: SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!
Also Read
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
వీరిద్దరి సంబంధం ఎంత ముదిరిందంటే, ఏకంగా ఆ వివాహిత తన భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఒకరోజు అర్ణవ్ తన భార్య ప్రియుడి ట్యాక్సీలో జైపూర్ నుంచి అల్వార్ వస్తుండగా వెనుక సీట్లో నిద్రపోయాడు. అర్ణవ్ నిద్రపోతున్నాడని అనుకున్న డ్రైవర్ రిషబ్ వెంటనే తన ప్రియురాలు అయిన అర్చనకు ఫోన్ చేసి.. “నువ్వు ఓకే అంటే.. ఇప్పుడే నీ భర్త పని ముగించేస్తాను (చంపేస్తాను)” అని చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ అర్ణవ్ అప్పటికే నిద్రలేచి ఉన్నాడు. ఆ మాటలు విన్న అతను ఏమాత్రం కంగారు పడకుండా, వారి మాటలను తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ ఒక్క రికార్డింగ్ వారి అసలు రంగును బయటపెట్టింది.
తన భార్య కుట్రను తెలుసుకున్న అర్ణవ్ ఆమెను నిలదీశాడు. దీంతో గొడవలు మొదలై చివరకు అవి విడాకుల వరకు వెళ్లాయి. అయితే విడాకులు ఇచ్చి విడిపోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని అర్చన డిమాండ్ చేసింది. దానికి ఆమె భర్త నిరాకరించడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడు రిషబ్తో కలిసి పరారైంది. 2026 మార్చిలో భర్త అర్ణవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. భార్యను ఆమె ప్రియుడిని పోలీసులు గాలిస్తుండగానే, తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన అర్చన – రిషబ్ స్వయంగా అల్వార్ ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు అర్చనను జైలుకు పంపగా, ఆమె ప్రియుడు రిషబ్ను విచారిస్తున్నారు. కళ్లముందు కనిపిస్తున్న అందమైన జీవితాన్ని కాలదన్ని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ మహిళ జీవితాన్ని కటకటాల పాలు చేసింది.
READ ALSO: RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!