IPL 2023 : ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ప్లేయర్స్ పై నిషేదం..? బీసీబీ చర్యలతో అసంతృప్తిలో బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని చర్యలు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలక నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు దేశాల ఆటగాళ్లను ఐపీఎల్ 2024లో నిషేదించవచ్చని తెలుస్తోంది. వచ్చే సీజన్ లో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సిరీస్ లను ఐపీఎల్ సమయంలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఐపీఎల్ జట్టులో భాగమైన చాలా మంది ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు ఫ్రాంఛైజీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023లో షక్ీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహమాన్ లతో సహా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటారు. ముగ్గురు ఆటగాళ్లు తమ సంబంధిత ఐపీఎల్ జట్లకు ఏప్రిల్ 9 నుంచి యమే 5 వరకు.. మళ్లీ మే 15 నుంచి అందుబాటులో ఉంటారు.
Also Read : Nedurumalli RamkumarReddy: ఆనం బాధంతా మంత్రి పదవి ఇవ్వలేదనే..
Also Read
ఇది కాకుండా నలుగురు శ్రీలంక ఆటగాళ్లలో ముగ్గురు ఏప్రిల్ 8 తర్వాత మాత్రమే ఐపీఎల్ కి అందుబాటులో ఉంటారు. ఇందులో వాణిందు హసరంగ, మతిషా పతిరన, మహేష్ తీక్షణ ఉన్నారు. ఏప్రిల్ 8 వరకు శ్రీలంక-న్యూజిలాండ్ పర్యలనలో ఉండనుంది. ఒక ఫ్రాంఛైజీ అధికారి ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ఇతర బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నందున మేం ఫిర్యాదు చేయలేం.. ఫ్రాంఛైజీలు కొన్ని దేశాల నుంచి ఆటగాళ్లను ఎంచుకోవడానికి వెనుకాడుతుంది. తస్కిన్ అహ్మద్ ఎన్ఓసీ పొందలేదు.. ఇప్పుడు ఇలాంటి వార్త వచ్చింది. వారు తమ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడించకూడదంటే.. వారు నమోదు చేసుకోకూడదు.. సహజంగానే బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆలోచన భవిష్యత్ లో మారుతుంది అని తెలిపాడు.
Also Read : Papaya Seeds : పండు తిని గింజలని పారేస్తే పొరపాటే
ఈ సమస్య గురించి నన్ను పదేపదే అడిగారు అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పాపోన్ పేర్కొన్నాడు. నేను అదే సమాధానం ఇచ్చాను.. ఐపీఎల్ వేలానికి పిలిచే ముందు.. ఐపీఎల్ అధికారులు ఆటగాళ్ల లభ్యత గురించి మమ్మల్ని అడిగారు.. మేం వారికి షెడ్యూ్ల్ ఇచ్చాం.. ఈ విషయం తెలుసుకున్న ఆయన వేలానికి ముందుకొచ్చారు.. అతను బంగ్లాదేశ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండకుండా ఉండే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను.. అలాంటప్పుడు కాస్త డౌట్ వస్తుందేమో ఆలోచించుకోమని చెప్పాం.. మేం దానిని క్లియర్ చేశాం.. నిజం చెప్పాలంటే మనసు మార్చుకునే అవకాశం నాకు కనిపంచిండం లేదు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు.
Also Read : Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన
తమ బోర్డుని ఒప్పించడం ఆటగాళ్లపైనే ఉంటుందని ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇతర ప్రధాన బోర్డులు దీని కోసం మార్గాలను రూపొందించాయి. ఐపీఎల్ ప్రజాదరణను ఎవరూ కాదనలేరు. ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా బోర్డు కూడా వారి వాటాను పొందుతుంది. కానీ, వారు వేరే నిర్ణయం తీసుకుంటే.. అది వారిపై ఉంటుంది. అంటూ చెప్పకొచ్చాడు.
- Tags
- bangladeshi
- bcci
- india
- IPL 2023
- Srilanka
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!