Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోసి ప్రధాన పాత్రలో తెరకెక్కిన త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుందిగా.. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్ణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో. ఇండియన్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన త్రీ ఇడియట్స్ సినిమా అప్పట్లో ఒక సంచలనం.
Also Read : Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
2016లో ఆమిర్ ఖాన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. త్రీ ఇడియట్స్ కు సీక్వెల్ ఉంటుందని రాజ్ కుమార్ హిరానీ నాకు చిన్న హింట్ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పెట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్ కు సీక్వెల్ ఉంటుందని చెప్పడానికే ప్రెస్ మీట్ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్ ఆడబోతున్నట్లు ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్ చేశారు. తాము క్రికెట్ లోకి ఎంటర్ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్ ( అడ్వర్ట్వెజ్మెంట్) లోకి ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి అంటూ ఆమిర్ చెప్పాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే అని అన్నాడు.
Also Read : Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో
మార్చ్ 31న ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ సీజన్ కు సంబంధించిన ఒక ప్రమోసన్ వీడియోను షూట్ చేశాడు. డ్రీమ్ ఎలెవన్, ఐపీఎల్ కోసం ఈ వీడియో ను షూట్ చేసింది. మేం యాక్టింగ్ లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం.. అని ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు.. ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్ మ్యాన్ లు అయిపోలేరు.. అంటూ ట్రోల్ చేశాడు. మాటలు చెప్పడం ఈజీ ఆడటం కష్టం ఎప్పుడు తెలుసుకుంటావ్ ఆమిర్ జీ అంటూ ఆశ్విన్ ఫన్సీ కామెంట్స్ చేశారు. ఇక హార్థిక్ పాండక్యా స్పందిస్తూ ఒక్క బౌన్సర్ తో మీ ముగ్గురు గ్రౌండ్ లోనే కుప్పకూలడం ఖాయం అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!