Bangladesh Violence: బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని హింస.. ఇళ్లను వదిలివెళ్లిన కుటుంబాలు
- బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న హింస
- హిందూ యువకుడిపై దైవదూషణ ఆరోపణలు రావడంతో చెలరేగిన హింస
- ఇళ్లపై దాడి చేసి ధ్వంస చేసిన ఛాందసవాద మూక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. నిన్న(బుధవారం) హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది. ఫేస్బుక్ పోస్ట్లో హిందూ యువకుడిపై దైవదూషణ ఆరోపణలు రావడంతో హింస జరిగింది. ఛాందసవాద మూక 100 మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసింది. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. మీడియా నివేదిక ప్రకారం, ఇటీవల 200కు పైగా హిందూ కుటుంబాలు వలస వెళ్లాయి. ఆరోపణల నేపథ్యంలో, దైవదూషణ ఆరోపణలపై సుమన్గంజ్లోని మంగళర్గావ్కు చెందిన ఆకాష్ దాస్ (20)ని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: AlluArjun : అల్లు అర్జున్ రాకతో సంధ్య థియేటర్ లో తొక్కిసలాట మహిళ మృతి.
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటిసారి బహిరంగ ప్రసంగం చేసి, యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను మారణహోమం చేస్తోందని ఆరోపించారు. యూనస్ ప్రభుత్వం నన్ను, నా సోదరి రెహానాను చంపాలనుకుంటోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విక్టరీ డే సందర్భంగా న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన వర్చువల్ అడ్రస్లో, హసీనా మాట్లాడుతూ.. ” నేను బంగ్లాదేశ్ను విడిచిపెట్టి ప్రజల ప్రాణాలను రక్షించడానికి నిర్ణయించుకున్నాను. నా స్వంత ప్రాణాలను కాపాడుకోవడానికి కాదు.” అని అన్నారు. మరోవైపు, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ హిందూ మైనారిటీని రక్షించాలని, ఇటీవలి దాడులు, మైనారిటీ వర్గాల కొనసాగుతున్న నిరసనలను పరిష్కరించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని హింసకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడంలో, వారి భద్రతకు భరోసా ఇవ్వడంలో ప్రస్తుత పరిపాలన నాయకత్వం చూపాలని షెర్మాన్ కోరారు.
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!