Durgama Idols Destroyed: ఘోరం.. దుర్గామాత విగ్రహాలు ధ్వంసం.. ఎక్కడంటే?
- హిందువులపై మహ్మద్ యూనస్ ప్రభుత్వం కఠిన వైఖరి
- దుర్గాపూజకు అనుమతి లేదని స్పష్టం
- పలు ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం. ఇప్పుడు దుర్గాపూజను జరుపుకోవడానికి అనుమతించకపోవడం… ఇవన్నీ బంగ్లాదేశ్ కృతజ్ఞతలేనితనానికి ఉదాహరణలు. నేటి నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కానీ బంగ్లాదేశ్ ఇప్పటికీ దుర్గాపూజ జరుపుకోవడానికి అనుమతించడం లేదు. బంగ్లాదేశ్లో దుర్గాపూజ విషయంలో దుమారం రేపుతోంది.
READ MORE: Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. భక్తులకు ఈవో కీలక సూచనలు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
దుర్గాపూజకు హిందువులకు అనుమతి ఇవ్వడానికి దేశంలోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం, ముస్లిం సంస్థలు నిరాకరించాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, దాడి జరిగే ప్రమాదం ఉందన్నది వారి వాదన. అదే సమయంలో.. అనుమతి పొందిన పూజా కమిటీలు నమాజ్ సమయంలో శాంతిని కాపాడాలని కోరారు. అంటే నమాజ్ సమయంలో పూజలు, భజనలు ఆపేయాలని ఆదేశించారు. ఇదే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి దుర్గా విగ్రహాలు ధ్వంసమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున కిషోర్గంజ్లోని బట్రిష్ గోపీనాథ్ జియుర్ అఖారాలో దుర్గామాత యొక్క సరికొత్త విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని కొమిల్లా జిల్లాలో ఓ ఆలయంలో కూడా దుర్గా మాత విగ్రహాన్ని పగులగొట్టి ఆలయంలోని విరాళాల పెట్టెను దోచుకెళ్లారు. రెండు రోజుల క్రితం నారాయణ్ జిల్లాలోని మిరపరాలోని దుర్గా గుడిపై ఛాందసవాదులు దాడి చేశారు.
READ MORE:Kia Carnival 2024 Price: ‘కియా కార్నివాల్’ లాంచ్.. ఇట్స్ వెరీ కాస్ట్లీ! ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే
ఇదిలాఉండగా.. అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దుర్గాపూజకు ముందు ‘జిజ్యా’ పన్నుగా పూజా పండల్కు రూ. 5 లక్షలు చెల్లించాలని పూజా కమిటీలను లిఖితపూర్వకంగా కోరినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. జిజ్యా పన్ను కారణంగా, పూజను నిర్వహించకూడదని ఇప్పటికే పెద్ద సంఖ్యలో కమిటీలు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. యూనస్ ప్రభుత్వం బుధవారం భారతదేశంలో పోస్ట్ చేసిన వారితో సహా ఐదుగురు రాయబారులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో ఈ సంఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. బ్రస్సెల్స్, కాన్బెర్రా, లిస్బన్, న్యూఢిల్లీ, న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్లో నియమించబడిన రాయబారులను ఢాకాకు తిరిగి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా భారత్తో చెలగాటమాడుతోంది.
తాజావార్తలు
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
-
Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
-
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!