NTV Telugu Site icon

Bangladesh : ఈద్ సందర్భంగా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లబ్ధిపొందనున్న 20లక్షల కుటుంబాలు

Muhammad Yunus

Muhammad Yunus

Bangladesh : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేదు. అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రాను రాను ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో యూనస్ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. తాజాగా యూనస్ ప్రభుత్వం దేశంలోని పేద కుటుంబాలకు రేషన్ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దాదాపు 7 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేస్తుందని ప్రభుత్వ ప్రతినిధి అలీ ఇమామ్ మజుందార్ సోమవారం తెలిపారు.

ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం మతపరమైన పండుగలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈద్ సందర్భంగా ప్రజలకు అదనంగా 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనుస్ మంత్రి అలీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రభుత్వం కోటి కుటుంబాలకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

Read Also:Delhi New CM: ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!

డిప్యూటీ కమిషనర్ల సమావేశంలో రెండవ రోజు, ఆహార , భూమి మంత్రిత్వ శాఖ సలహాదారుడు ‘ఆహార స్నేహపూర్వక కార్యక్రమం'(Food friendly program) కింద 50 లక్షల కుటుంబాలకు మూడు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు.. ఇందులో ప్రతి కుటుంబానికి కిలోగ్రాముకు 15 టాకాల చొప్పున 30 కిలోల బియ్యం లభిస్తాయని చెప్పారు. దీనితో పాటు, ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (TCB) ద్వారా రెండు నెలల్లో లక్ష టన్నుల బియ్యం పంపిణీ చేయబడుతుంది. ఓపెన్ మార్కెట్ సేల్ (OMS) పథకం ద్వారా మరో లక్ష టన్నుల బియ్యం కేటాయించబడుతుంది.

వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ముస్లింల పవిత్ర మాసానికి కూడా ప్రత్యేక సన్నాహాలు జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా సజావుగా ఆహార పంపిణీ కోసం, ఈ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో అమలు చేయాలని సలహాదారు డిసిని ఆదేశించారు. “పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు సబ్సిడీ ధరలకు అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో రంజాన్ సందర్భంగా ఉచితంగా ఇస్తారు” అని ఆయన చెప్పారు.

Read Also:Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం