Bangladesh : ఈద్ సందర్భంగా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లబ్ధిపొందనున్న 20లక్షల కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేదు. అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రాను రాను ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో యూనస్ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. తాజాగా యూనస్ ప్రభుత్వం దేశంలోని పేద కుటుంబాలకు రేషన్ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దాదాపు 7 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేస్తుందని ప్రభుత్వ ప్రతినిధి అలీ ఇమామ్ మజుందార్ సోమవారం తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం మతపరమైన పండుగలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈద్ సందర్భంగా ప్రజలకు అదనంగా 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనుస్ మంత్రి అలీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రభుత్వం కోటి కుటుంబాలకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also:Delhi New CM: ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!
డిప్యూటీ కమిషనర్ల సమావేశంలో రెండవ రోజు, ఆహార , భూమి మంత్రిత్వ శాఖ సలహాదారుడు ‘ఆహార స్నేహపూర్వక కార్యక్రమం'(Food friendly program) కింద 50 లక్షల కుటుంబాలకు మూడు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు.. ఇందులో ప్రతి కుటుంబానికి కిలోగ్రాముకు 15 టాకాల చొప్పున 30 కిలోల బియ్యం లభిస్తాయని చెప్పారు. దీనితో పాటు, ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (TCB) ద్వారా రెండు నెలల్లో లక్ష టన్నుల బియ్యం పంపిణీ చేయబడుతుంది. ఓపెన్ మార్కెట్ సేల్ (OMS) పథకం ద్వారా మరో లక్ష టన్నుల బియ్యం కేటాయించబడుతుంది.
వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ముస్లింల పవిత్ర మాసానికి కూడా ప్రత్యేక సన్నాహాలు జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా సజావుగా ఆహార పంపిణీ కోసం, ఈ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో అమలు చేయాలని సలహాదారు డిసిని ఆదేశించారు. “పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు సబ్సిడీ ధరలకు అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో రంజాన్ సందర్భంగా ఉచితంగా ఇస్తారు” అని ఆయన చెప్పారు.
Read Also:Hyderabad: ఆన్లైన్ గేమ్లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..