Bangladesh Cricket: భారత్తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Cricket: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్కటిగా పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ క్రికెట్లోనూ సరికొత్త శకం ప్రారంభమైంది. మాజీ కెప్టెన్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 11 మంది సభ్యులతో కూడిన అడ్-హాక్ కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం బోర్డులో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బాధ్యతలు చేపట్టి వెంటనే తమీమ్ భారత్తో సంబంధాలపై దృష్టి సారిస్తున్నారు. గతం కొంత కాలంగా టీమిండియాతో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తమీమ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్లో పర్యటించేందుకు ఆసక్తి చూపడమే కాకుండా, ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సిరీస్ కోసం బీసీసీఐని బంగ్లాదేశ్కు ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించే దౌత్యపరమైన ప్రయత్నంగా కనిపిస్తోంది.
READ MORE: Trump: ఇరాన్కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
వాస్తవానికి, టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక హోస్ట్ చేసింది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సీజన్కు బంగ్లాదేశ్ దూరమైంది. భారత్కు వచ్చేందుకు బంగ్లాదేశ్ టీమ్ నిరాకరించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మ్యాచుల వేదికలను మార్చాలన్న బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. అంతేకాదు.. ఆ దేశం స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అడ్మిన్ ఇస్లాం బుల్బుల్ను బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన కొత్త యాజమాన్యం, రాబోయే 90 రోజుల్లోగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి బోర్డును గాడిలో పెట్టాలని భావిస్తోంది. మరోవైపు, తనను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఛైర్మన్ బుల్బుల్ ఐసీసీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంలో బుల్బుల్కు ఐసీసీ నుంచి పెద్దగా మద్దతు లభించేలా లేదు. దీనికి ప్రధాన కారణం ఆయన అనుసరించిన ‘ద్వంద్వ నీతి’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం భారత పర్యటనకు వెళ్లొద్దని ప్రభుత్వం చెప్పిందని, అందుకే తాము రావడం లేదని గతంలో ఐసీసీకి బుల్బుల్ చెప్పారు. కానీ ఇప్పుడు తన పదవి తొలగింపు విషయంలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!