Bangladesh Cricket: భారత్తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Cricket: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్కటిగా పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ క్రికెట్లోనూ సరికొత్త శకం ప్రారంభమైంది. మాజీ కెప్టెన్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 11 మంది సభ్యులతో కూడిన అడ్-హాక్ కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం బోర్డులో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బాధ్యతలు చేపట్టి వెంటనే తమీమ్ భారత్తో సంబంధాలపై దృష్టి సారిస్తున్నారు. గతం కొంత కాలంగా టీమిండియాతో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తమీమ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్లో పర్యటించేందుకు ఆసక్తి చూపడమే కాకుండా, ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సిరీస్ కోసం బీసీసీఐని బంగ్లాదేశ్కు ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించే దౌత్యపరమైన ప్రయత్నంగా కనిపిస్తోంది.
READ MORE: Trump: ఇరాన్కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
వాస్తవానికి, టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక హోస్ట్ చేసింది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సీజన్కు బంగ్లాదేశ్ దూరమైంది. భారత్కు వచ్చేందుకు బంగ్లాదేశ్ టీమ్ నిరాకరించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మ్యాచుల వేదికలను మార్చాలన్న బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. అంతేకాదు.. ఆ దేశం స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అడ్మిన్ ఇస్లాం బుల్బుల్ను బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన కొత్త యాజమాన్యం, రాబోయే 90 రోజుల్లోగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి బోర్డును గాడిలో పెట్టాలని భావిస్తోంది. మరోవైపు, తనను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఛైర్మన్ బుల్బుల్ ఐసీసీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంలో బుల్బుల్కు ఐసీసీ నుంచి పెద్దగా మద్దతు లభించేలా లేదు. దీనికి ప్రధాన కారణం ఆయన అనుసరించిన ‘ద్వంద్వ నీతి’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం భారత పర్యటనకు వెళ్లొద్దని ప్రభుత్వం చెప్పిందని, అందుకే తాము రావడం లేదని గతంలో ఐసీసీకి బుల్బుల్ చెప్పారు. కానీ ఇప్పుడు తన పదవి తొలగింపు విషయంలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!