Vegetarian Orders: వెజ్ ఫుడ్కి ఫుల్ డిమాండ్.. టాప్ 3లో హైదరాబాద్.. ఎక్కువ ఆర్డర్లు వీటికే..
- పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ నివేదికలో ఆసక్తికర అంశాలు..
- బెంగళూరు సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది వెజ్జీ వ్యాలీ అంటున్న స్విగ్గీ..
- అత్యధిక వెజ్ ఆర్డర్లలో రెండో స్థానంలో నిలిచిన ముంబై..
- ఈ 'ర్యాంకింగ్'లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన హైదరాబాద్..
- టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమేనని అని పేర్కొన్న స్విగ్గీ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetarian Orders: ఆన్లైన్ ఫుడ్ అనగానే ఎక్కువగా నాన్వెజ్ వైపే మొగ్గుచూపుతారని అనుకుంటాం.. కానీ, వెజ్కు కూడా మంచి డిమాండే ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే.. ముక్కలేనిది ముద్ద దిగదు అనే మాట వినిపడుతుంది.. అలాంటిది.. వెజ్ ఫుడ్ ఆర్డర్లలో టాప్ 3లో నిలిచింది మన మహానగరం.. పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.. స్విగ్గీ యొక్క అంతర్గత డేటా విశ్లేషణను విడుదల చేసింది. దాని ప్రకారం.. భారత్లోని ఈ సిటీలు అత్యధిక శాఖాహార ఆర్డర్లు కలిగి ఉన్నాయి..
Read Also: Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
స్విగ్గి శాఖాహార ఆహార ఆర్డర్లపై అంతర్గత విశ్లేషణ ఫలితాలను విడుదల చేసింది. ఏ నగరంలో అత్యధిక వెజ్ ఆర్డర్లు ఉన్నాయో తెలిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. బెంగుళూరు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది వెజ్జీ వ్యాలీ కూడా అంటూ పేర్కొంది.. ప్రతి మూడు శాకాహార స్విగ్గీ ఆర్డర్లలో ఒకటి బెంగళూరు నగరం నుండేనని నివేదిక వెల్లడించింది. ఇక, ఆ ఆర్డర్లలో మసాలా దోస, పనీర్ బిర్యానీ మరియు పనీర్ బటర్ మసాలా బెంగుళూరులో స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన టాప్ వెజ్ వంటకాలుగా పేర్కొంది..
Read Also: Karnataka Health Minister: జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే
ఇక, రెండవ అత్యధిక వెజ్ ఆర్డర్లను కలిగి ఉన్న సిటీ ముంబై అని పేర్కొంది స్విగ్గీ.. ఇక్కడ టాప్ వంటకాల విషయానికి వస్తే.. దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ ఉన్నాయని తెలిపింది. ఈ ‘ర్యాంకింగ్’లో మూడవ స్థానం హైదరాబాద్ ఆక్రమించింది.. ఇక్కడ మసాలా దోస మరియు ఇడ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఆర్డర్లుగా స్విగ్గీ వెల్లడించింది.. దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమేనని అని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. మసాలా దోస, పనీర్ బటర్ మసాలా, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ టాప్లో ఉన్నాయి.
Read Also: TB BCG Vaccines in AP: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..
ఈ ప్లాట్ఫారమ్లో 90 శాతం కంటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్లు శాఖాహారం కాబట్టి, ఇది అల్పాహారాన్ని “శాఖాహార ఆర్డర్లకు గోల్డెన్ అవర్” అని పిలిచింది. మసాలా దోస, వడ, ఇడ్లీ మరియు పొంగల్ అత్యంత ప్రసిద్ధ బ్రేక్ఫాస్ట్ వంటకాలు. అయినప్పటికీ, “మసాలా దోస దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని చెప్పాలి.. బ్రేక్ఫాస్ట్ , లంచ్ మరియు డిన్నర్ కోసం ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక” అని హైలైట్ చేసింది. ఇక, స్విగ్గీలో వారానికి 60,000 వెజ్ సలాడ్లు ఆర్డర్ చేయబడతాయని తెలిపింది..
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?