Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..
- కేవలం 12 గంటల్లోనే ఇద్దరు ఇజ్రాయిల్ శత్రువులు హతం..
- టెహ్రాన్లో హమాస్ చీఫ్ హనియే హత్య..
- బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరు కేవలం 12 గంటల వ్యవధిలోనే హతమార్చబడ్డారు. టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. దీనికి కొన్ని గంటల ముందు లెబనాన్ నుంచి పనిచేస్తున్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ బీరూట్లో చంపబడ్డాడు. ఇలా ఎవరినైనా, ఎక్కడనైనా తమ శత్రువులని భావిస్తే చంపడం ఇజ్రాయిల్కి వెన్నతో పెట్టిన విద్య అని నిపుణులు చెబుతున్నారు. పాలస్తీనాకు గట్టి మద్దతుదారులుగా ఉన్న హమాస్, హిజ్బుల్లాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తుల్ని గంటల వ్యవధిలో చంపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి సంఘర్షణగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యలో మా ప్రమేయం లేదు: అమెరికా..
Also Read
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సమయంలో రాజధాని టెహ్రాన్లో హనియే హత్యకు గురయ్యాడు. లెబనాన్ రాజధాని బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఫువాద్ని హతమార్చింది తామే అని ఇజ్రాయిల్ వైమానిక దళం బాధ్యత వహిస్తున్నప్పటికీ, హనియే మరణంపై మాత్రం ఇజ్రాయిల్ తమ ప్రమేయం లేదని చెబుతోంది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా 200కి పైగా ఇజ్రాయిల్ పౌరుల్ని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో హమాస్ నాయకులు ఎక్కడ ఉన్నా నిర్మూలిస్తామని చెప్పింది. ఇందుకు గూఢచార సంస్థ మొస్సాద్కి కూడా నెతన్యాహూ నుంచి ఆర్డర్స్ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే హనియే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనక ఇజ్రాయిల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తూ, దానికి ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!