Bandi Sanjay-KCR: కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు!
- కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు
- కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం
- సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదు
కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్చాట్లో బండి సంజయ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.
‘కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. సీఎం తన భాషపై పునరాలోచన చేయాలి. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది. కేసీఆర్ కుమారుడు అహంకారం తలకెకినట్టు మాట్లాడుతారు. గతంలో కేసీఆర్ మాట్లాడితే మేము ఖండించాం. సీఎం రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Also Read: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
‘తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఏమీ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది ముందు నేనే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారు. ముడుపుల కోసం 575 టీఎంసీలు అడగలేదు. కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించాను. కాళేశ్వరం స్కాం నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కృష్ణ జలాలు ఇష్యూ తెరపైకి తెస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలి. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!