Bandi Sanjay : సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి, సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై నిజమైన నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు స్పందించరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా.. రాజాసింగ్, నుపూర్ శర్మ వ్యాఖ్యలపై మొరిగిన గళాలు ఉదయనిధి విషయంలో ఎందుకు మూతపడ్డాయ్? సనాతన ధర్మంపై కరుణానిధి మనవడు, సోనియా కొడుకు చెబితే వినాల్సిన ఖర్మ భారతీయులకు పట్టలేదు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
Also Read : Sundar Pichai: గూగుల్కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఐఎన్డీఐఏ కూటమిలోని పార్టీలు దీనిపై ఎందుకు స్పందించలేదు? హిందూ ధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కన్పిస్తోంది. ఈ కూటమి ఒక్కటి గుర్తుంచుకోవాలి… సనాతన ధర్మాన్ని అంతమొందించాలని కుట్ర చేసినోళ్లంతా సమాధుల్లో ఉన్నారు. ఛత్రపతి శివాజీ వారసుల జోలికొస్తే ఔరంగజేబు నుండి బ్రిటీష్ వాళ్ల వరకు అందరూ అంతమైపోయిన విషయాన్ని కుహానా లౌకిక వాళ్లంతా ఆలోచించుకోవాలి. సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా సరే…సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని నుపూర్ శర్మను, రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న ఈ ఐఎన్డీఐఏ కూటమి భాగస్వామ్య పార్టీల నోళ్లు ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఎందుకు మూతపడ్డయ్. దీనిద్వారా అర్ధమవుతున్నదేమిటంటే.. అది నిజమైన ఇండియా కూటమి కాదు… ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి అని అర్ధమవుతోంది. ఇప్పటికైనా ఆ కూటమి భాగస్వామ్యపక్షాలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించాలి. లేనిపక్షంలో హిందూ ద్రోహులుగా గుర్తించకతప్పదు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూ సమాజాన్ని కోరుతున్నా.’ అని బండి సంజయ్ ప్రకటనను విడుదల చేశారు.
Also Read : MP Laxman : దివ్యాంగుల కోసం మోడీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?