Bandi Sanjay : సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి, సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై నిజమైన నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు స్పందించరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా.. రాజాసింగ్, నుపూర్ శర్మ వ్యాఖ్యలపై మొరిగిన గళాలు ఉదయనిధి విషయంలో ఎందుకు మూతపడ్డాయ్? సనాతన ధర్మంపై కరుణానిధి మనవడు, సోనియా కొడుకు చెబితే వినాల్సిన ఖర్మ భారతీయులకు పట్టలేదు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
Also Read : Sundar Pichai: గూగుల్కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ఐఎన్డీఐఏ కూటమిలోని పార్టీలు దీనిపై ఎందుకు స్పందించలేదు? హిందూ ధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కన్పిస్తోంది. ఈ కూటమి ఒక్కటి గుర్తుంచుకోవాలి… సనాతన ధర్మాన్ని అంతమొందించాలని కుట్ర చేసినోళ్లంతా సమాధుల్లో ఉన్నారు. ఛత్రపతి శివాజీ వారసుల జోలికొస్తే ఔరంగజేబు నుండి బ్రిటీష్ వాళ్ల వరకు అందరూ అంతమైపోయిన విషయాన్ని కుహానా లౌకిక వాళ్లంతా ఆలోచించుకోవాలి. సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా సరే…సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని నుపూర్ శర్మను, రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న ఈ ఐఎన్డీఐఏ కూటమి భాగస్వామ్య పార్టీల నోళ్లు ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఎందుకు మూతపడ్డయ్. దీనిద్వారా అర్ధమవుతున్నదేమిటంటే.. అది నిజమైన ఇండియా కూటమి కాదు… ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి అని అర్ధమవుతోంది. ఇప్పటికైనా ఆ కూటమి భాగస్వామ్యపక్షాలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించాలి. లేనిపక్షంలో హిందూ ద్రోహులుగా గుర్తించకతప్పదు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూ సమాజాన్ని కోరుతున్నా.’ అని బండి సంజయ్ ప్రకటనను విడుదల చేశారు.
Also Read : MP Laxman : దివ్యాంగుల కోసం మోడీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!