సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ రాశారు. బీసీ బంధును అమలు చేయాలని… ముగ్గురు కాదు.. క్యాబినెట్ లో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని… జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలన్నారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడాలని… టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో బీసీ సబ్ ప్లాన్ అటకెక్కిందని తెలిపారు.
బీసీ సబ్ ప్లాన్ కు చట్ట భద్రత కల్పించాలని… 46 బీసీ కులాలకు నిర్మిస్తామనన్న ఆత్మ గౌరవ భవనాల అడ్రస్ ఎక్కడ? అని నిలదీశారు. 3,400 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలని.. చేనేత కార్మికులకు భీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులను ఆడుకోవడంతో పాటు.. రజకుల కోసం దోబీ ఘాట్లు… నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు కేటాయించాలన్నారు బండి సంజయ్.