గ్రూప్ 2 వాయిదా వేయండి అంటే.. ప్రభుత్వం టీఎస్సీఎస్సీ పరిధి లోని అంశం అన్నారని, ఆందోళన చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. కోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ వేస్తే.. పునరాలోచన చేయాలని.. సోమవారం కౌంటర్ వేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ షాడో సీఎం .. గ్రూప్ 2 వాయిదా వేయండి అని ట్వీట్ చేశాడంటూ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. పేపర్ లీక్ అయితే మాకేం సంబంధం టీఎస్సీఎస్సీ మీద వేశాడని, కానీ కోర్టు గ్రూప్ 2 వాయిదా వేయండి అని చెప్తే… వాయిదా వేసినట్టు కేటీఆర్ ఎలా ట్వీట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
Also Read :Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!
పేపర్ లీక్ అయితే నీకు సంబంధం లేదు అంటావు.. పరీక్ష వాయిదా అని ట్వీట్ ఎలా చేస్తారని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు పరీక్ష వాయిదా అని ప్రకటన అయితే రాలేదని, కేటీఆర్ ట్వీట్ ఎలా నమ్ముతం అని ఆయన అన్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. గ్రూప్ 2 పరీక్షా అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం టీఎస్పీఎస్సీని సంప్రదించి గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారిని ఆదేశించారు. భవిష్యత్తులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు సక్రమంగా ఉండేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి సూచించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read : Rohit Sharma: ఆసియా కప్కి ముందు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!