Bala Veeranjaneya Swami: బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
- బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
- వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టిన మంత్రి
- తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తాం- మంత్రి
- తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది- మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు.. వాటిని తిరిగి పునరుద్దరిస్తూ తొలి సంతకం చేశానని చెప్పారు.
Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
Also Read
అలాగే.. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్మెంట్ ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని ఆరోపించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందని తెలిపారు.
Jammu Kashmir: దోడాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
మరోవైపు.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ. 199 కోట్లు బకాయిలున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ. 5.69 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లను గత ప్రభుత్వం రద్దు చేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్ధిక శాఖ నుంచి రూ. 21.81 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి రూ. 3573.22 కోట్లుగా ఉందని తెలిపారు. ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!