Bala Veeranjaneya Swami: బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
- బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
- వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టిన మంత్రి
- తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తాం- మంత్రి
- తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది- మంత్రి
మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు.. వాటిని తిరిగి పునరుద్దరిస్తూ తొలి సంతకం చేశానని చెప్పారు.
Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
అలాగే.. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్మెంట్ ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని ఆరోపించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందని తెలిపారు.
Jammu Kashmir: దోడాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
మరోవైపు.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ. 199 కోట్లు బకాయిలున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ. 5.69 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లను గత ప్రభుత్వం రద్దు చేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్ధిక శాఖ నుంచి రూ. 21.81 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి రూ. 3573.22 కోట్లుగా ఉందని తెలిపారు. ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?