Damodara Raja Narasimha : ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం..
- ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారు
- మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నాము
- యోగా.. ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదు : మంత్రి దామోదర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్స్ట్రక్టర్లకు మంత్రి అపాయింట్మెంట్ లెటర్లు అందించారు.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర. మానవాళికి సంబంధించిన అంశం. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమన్నారు. ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, పిల్లలకు దీన్ని నేర్పించాలన్నారు మంత్రి దామోదర. యోగా, ఆయుర్వేదను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని, యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా.
Delivery Agent : బతుకు పోరాటం.. రెండు చేతులు లేకున్నా.. బండి నడుపుతున్న జొమాటో డెలివరీ బాయ్
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
అంతేకాకుండా.. ఆయుష్ డైరెక్టరేట్ను సాంక్షన్ చేస్తామని, హైదరాబాద్, వరంగల్లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. స్టూడెంట్ల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామని, వారం రోజుల్లో విద్యార్థుల స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. స్టైఫండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, ఇంకో 214 మంది యోగా ఇన్స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తామన్నారు. ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదను గౌరవిస్తోంది. ఆదరిస్తోంది. మనం కూడా ఈ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా 1935లో ఆయుర్వేద కాలేజీ ఏర్పడిందని, 421 ఆరోగ్య మందిర్స్లో యోగా టీచర్లను నియమించామన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలకు యోగా అలవాటు చేయాలని, ఆరోగ్య మందిర్స్లో యోగా ఇన్స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారన్నారు.
Kapil Dev – Chandrababu: ఏపీ ముఖ్యమంత్రితో కపిల్ దేవ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!