Ayesha Meera: శ్మశాన వాటికలో ఆయేషా మీరా అవశేషాల ఖననం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Meera: 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో.. తాజాగా ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసును క్లోజ్ చేసిన అనంతరం అవశేషాలను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలను ఖననం చేశారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్లకు అవశేషాలు అప్పగించగా.. అక్కడి నుంచి తెనాలి తీసుకువచ్చి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఖననం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల కార్యకర్తలు, స్థానికులు భారీగా హాజరై “జోహార్ ఆయేషా మీరా… వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు.
TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
ఈ కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లిన తర్వాత 2019లో రీ-పోస్ట్మార్టం కోసం సమాధి నుంచి శరీర భాగాలు సేకరించారు. అయితే తాజాగా సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకేమీ లేవని తేల్చి కేసును మూసివేసింది. దాంతో అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అవశేషాల ఖననం అనంతరం ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఏం జరిగిందో వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. అప్పటి దర్యాప్తు అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని, ఆమె పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బాలికల విద్యకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!
18 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ ఫలితం రాలేదని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్లుమూసుకుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలో జరిగిన ఖననం కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో ముగిసింది. అయినప్పటికీ, ఆయేషా మీరా కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలనే డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!