Mukesh Kumar Meena: అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత..
- అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత- ముకేష్ కుమార్ మీనా
- ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి..
- స్టాక్యార్డ్ల వద్ద 4.8 లక్షలు.. డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా.. స్టాక్యార్డ్ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు. రోజువారీ సరఫరా సామర్థ్యం 37,000 మెట్రిక్ టన్నులు కాగా, అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు 1.5- 1.75 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేసామని మీనా తెలిపారు. డిమాండ్ను తీర్చడానికి సిద్దం చేసిన కార్యాచరణ ప్రణాళికను అనుసరించి డి-సిల్టేషన్ పాయింట్లు (28) నుండి 54 లక్షలు, మాన్యువల్ రీచ్లు (108) నుండి 70 లక్షలు, సెమీ-మెకనైజ్డ్ రీచ్లు (48) నుండి 140 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సేకరిస్తామన్నారు.
IND vs BAN: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ప్రస్తుతం డి-సిల్టేషన్ పాయింట్లు, మాన్యుల్ రీచ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని.. ఆగస్టు 15 నుండి డి-సిల్టేషన్ పాయింట్ల నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వర్షాకాలంలో నది ఒడ్డున ఇసుక మైనింగ్ కార్యకలాపాలపై పరిమితి కారణంగా అక్టోబర్ 16 నుండి మాన్యువల్ రీచ్ల నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఈ రెండు మార్గాల ద్వారా దాదాపు 1.25 కోట్ల మెట్రిక్ టన్నులు సమకూరుతుందన్నారు. సెమీ-మెకనైజ్డ్ రీచ్లను ఆపరేట్ చేయడానికి అనుమతుల ప్రక్రియ ప్రాసెస్లో ఉండగా డిసెంబర్ నాటికి మరో 140 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పట్టా భూముల నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, వీరంతా ఇసుక మేనేజ్మెంట్ పోర్టల్లో ఇసుక డీ-కాస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అభ్యర్థించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీలు భవిష్యత్తులో ఇసుక సరఫరాను సులభతరం చేయడానికి ఇసుక చేరిన ప్రాంతాలను మరింతగా గుర్తిస్తాయన్నారు.
Breaking: చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట.. నలుగురు మృతి
ధరల హెచ్చుతగ్గులు, రవాణాదారుల దోపిడీ లేకుండా ఉండేలా రాష్ట్రం అంతటా ఒకే విధంగా రేట్లు నియంత్రించబడగా.. వినియోగదారులకు ఇసుకను రవాణా చేయడానికి వారి స్వంత వాహనాలను ఎంచుకోవచ్చు లేదా నిర్ణీత రేటుతో ప్రభుత్వం అందించిన రవాణాను ఎంచుకోవచ్చని మీనా వివరించారు. “AP సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్”, ఆన్లైన్ పోర్టల్లో https://sand.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ప్రతి వారం ఇసుక సరఫరా సామర్థ్యం మేరకు రాబోయే వారానికి ఒకేసారి విడుదల చేస్తుండగా, భవిష్యత్తులో మిగిలి పోయిన వారంవారీ సరఫరాలో కొంత భాగాన్ని “తత్కాల్” తరహాలో అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అత్యవసర ఇసుక అవసరాలను తీర్చడానికి వారపు సామర్థ్యంలో 10 శాతం నిల్వను కలిగి ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పరంగా ఎటువంటి రుసుము వసూలు చేయటం లేదని, కేవలం సీనరేజి, నిర్వహణ, జిఎస్టి, రవాణా ఖర్చులు మాత్రమే ఉంటాయని ముఖేష్ కుమర్ మీనా తెలిపారు. అక్రమ కార్యకలాపాల నిరోధం, వనరుల రక్షణతో సహా ఇసుక తవ్వకం, రవాణా, మైనింగ్ వంటి వాటిపై ప్రభుత్వ విధానాలను ఖచ్చితంగా పాటించేలా ప్రతి జిల్లాలో బహుళ-విభాగ అధికారులతో (గనులు, రెవెన్యూ, పోలీస్, పర్యావరణం) జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తుందన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!