AUS vs IND: కమిన్స్కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!
- శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు
- ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు
- ఎవరినీ ఎంచుకోని కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో కొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం జట్లు నెట్స్లో చెమటోడ్చుతున్నాయి. పెర్త్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే.. టీమిండియా నుంచి ఎవరిని ఎంచుకుంటావు? అని కమిన్స్ను ప్రశ్నించారు. ఎవరినీ ఎంచుకోనని అతడు బదులిచ్చాడు. దాంతో భారత ఫాన్స్ ఫైర్ అవుతూ.. ‘కమిన్స్కు ఎంత బలుపు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ ఎంచుకున్నాడు. ‘నేను రోహిత్ శర్మను ఆసీస్ జట్టులోకి తీసుకుని.. టాప్ ఆర్డర్లో ఆడిస్తాను. రోహిత్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. అందరూ విరాట్ కోహ్లీని ఎంచుకుంటానని అనుకోవచ్చు కానీ.. నేను మాత్రం రోహిత్ను ఎంచుకుంటా’ అని హెడ్ చెప్పాడు. విరాట్ కోహ్లీని తీసుకుంటానని నాథన్ లైయన్ చెప్పాడు. ‘టాప్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్లకు తోడుగా విరాట్ కోహ్లీ ఉంటే.. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుంది. 2014లో ఓవల్లో జరిగిన టెస్టులో విరాట్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేశాడు. నా బౌలింగ్లో సునాయసంగా పరుగులు చేశాడు’ అని లైయన్ చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ను మిచెల్ మార్ష్.. జస్ప్రీత్ బుమ్రాను స్కాట్ బోలాండ్ ఎంచుకున్నారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
గత రెండు పర్యాయాలూ ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈసారి గెలుపుపై పెద్దగా ధీమా లేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలి రోజుల్లో పెద్దగా రన్స్ చేయలేదు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ భారత జట్టును కలవరపెడుతున్నాయి. బౌలర్ల మీదే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం సత్తా చాటితే.. సిరీస్లో పైచేయి సాధించడానికి అవకాశముంటుంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..