AUS vs IND: కమిన్స్కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!
- శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు
- ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు
- ఎవరినీ ఎంచుకోని కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో కొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం జట్లు నెట్స్లో చెమటోడ్చుతున్నాయి. పెర్త్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే.. టీమిండియా నుంచి ఎవరిని ఎంచుకుంటావు? అని కమిన్స్ను ప్రశ్నించారు. ఎవరినీ ఎంచుకోనని అతడు బదులిచ్చాడు. దాంతో భారత ఫాన్స్ ఫైర్ అవుతూ.. ‘కమిన్స్కు ఎంత బలుపు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ ఎంచుకున్నాడు. ‘నేను రోహిత్ శర్మను ఆసీస్ జట్టులోకి తీసుకుని.. టాప్ ఆర్డర్లో ఆడిస్తాను. రోహిత్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. అందరూ విరాట్ కోహ్లీని ఎంచుకుంటానని అనుకోవచ్చు కానీ.. నేను మాత్రం రోహిత్ను ఎంచుకుంటా’ అని హెడ్ చెప్పాడు. విరాట్ కోహ్లీని తీసుకుంటానని నాథన్ లైయన్ చెప్పాడు. ‘టాప్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్లకు తోడుగా విరాట్ కోహ్లీ ఉంటే.. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుంది. 2014లో ఓవల్లో జరిగిన టెస్టులో విరాట్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేశాడు. నా బౌలింగ్లో సునాయసంగా పరుగులు చేశాడు’ అని లైయన్ చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ను మిచెల్ మార్ష్.. జస్ప్రీత్ బుమ్రాను స్కాట్ బోలాండ్ ఎంచుకున్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
గత రెండు పర్యాయాలూ ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈసారి గెలుపుపై పెద్దగా ధీమా లేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలి రోజుల్లో పెద్దగా రన్స్ చేయలేదు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ భారత జట్టును కలవరపెడుతున్నాయి. బౌలర్ల మీదే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం సత్తా చాటితే.. సిరీస్లో పైచేయి సాధించడానికి అవకాశముంటుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?