AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!
- ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే
- కళ్లన్నీ రో-కోల మీదే
- భారత్ తుది జట్లు (అంచనా)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం పెర్త్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చివరగా మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన టీమిండియా.. ఏడు నెలల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్కు తొలి పరీక్ష ఎదురుకానుంది. ఇక కళ్లన్నీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కంగారూ గడ్డపై ఈ దిగ్గజాలు తమదైన శైలిలో రాణిస్తారో చూడాలి.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. రోహిత్ ఎప్పట్లాగే దూకుడుగా ఆడతాడా? లేదా? అన్నది చూడాలి. గిల్ ఎలాంటి ఆరంభాన్నిస్తాడో చూడాలి. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో ఆడనున్నారు. ఇటీవల దేశవాళీల్లో దుమ్మురేపుతోన్న శ్రేయస్ ఆటపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక తెలుగు ఆటగాడు నితీశ్ వన్డేల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. అక్షర్ పటేల్ బ్యాటుతో సత్తా చాటాతే టీమిండియాకు తిరుగుండదు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే సిరీస్కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ మీద అధిక భారం పడనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇష్టమైన వ్యక్తి హర్షిత్ రాణాకు మొదటి ప్రాధాన్యత దక్కనుంది. సిరాజ్తో కలిసి కొత్త బంతిని అతడు పంచుకోనున్నాడు. అర్ష్దీప్ సింగ్ ఉన్నా రాణాకే ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. మూడో పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. అక్షర్కు తోడుగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ల్లో ఒకరికి చోటు దక్కనుంది.
Also Read: Daily Horoscope: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
భారత్ తుది జట్లు (అంచనా):
శుభ్మన్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్ రెడ్డి, అక్షర్పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!