Sarpanch Election: సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!
- సర్పంచ్ పదవి వేలం
- రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్న బీజేపీ నాయకుడు
- ఈ విషయాన్ని ఖండిస్తున్న రాజకీయ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarpanch Election: పంజాబ్లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్పూర్లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ. 50 లక్షలకు వేలం ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు. విషయం తెలియగానే పలువురు రాజకీయ నాయకులు ఖండించారు.
వాస్తవానికి పంజాబ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి. అంతకు ముందు గురుదాస్పూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట జరిగింది. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత చెక్కు ద్వారా చెల్లింపు చేసిన నాయకుడు ఆత్మా సింగ్, గ్రామస్తులు గ్రామానికి గరిష్ట మొత్తంలో డబ్బు ఇచ్చే సర్పంచ్ను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. వేలం మొత్తాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. నిధుల కేటాయింపుపై గ్రామస్తులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆత్మాసింగ్ తండ్రి కూడా గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. హర్దోవల్ కలాన్ గురుదాస్పూర్ జిల్లాలోని అతిపెద్ద గ్రామాలలో ఒకటి. దాదాపు 350 ఎకరాల పంచాయతీ భూమిని కలిగి ఉంది. ఇలాంటి ఘటన ఒక్క జిల్లాలోనే కాదు. భటిండాలోని ఘరి బుట్టార్ గ్రామంలో సర్పంచ్ పదవికి కూడా ఇదే విధంగా వేలం నిర్వహించారు. ఈ పదవికి ఆశపడిన వ్యక్తి రూ. 60 లక్షలకు వేలం వేశారు, అయితే తుది ఆర్థిక నిర్ణయానికి రాలేకపోయారు.
Also Read
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా వేలాన్ని ఖండించారు. నిర్వహించే వారికి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, “ఇది బహిరంగ అవినీతి. ఇది తప్పు. 2 కోట్లు ఆఫర్ చేసిన వారిపై విజిలెన్స్ బ్యూరో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.” అని డిమాండ్ చేశారు. పంజాబ్లో 13,237 ‘సర్పంచ్’ స్థానాలకు అక్టోబర్ 15న బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. అక్టోబర్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 7 చివరి తేదీ. ఓటింగ్ రోజు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!