Atchannaidu: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఓడిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu Fire On Cm Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. సీఈవోను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు ఉన్నారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లపై సీఈఓకు టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Shrimp Farming : రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
శ్రీకాకుళం, కోనసీమ, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల కలెక్టర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాప్తాడులో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా అనంతపురం కలెక్టర్ పట్టించుకోలేదు.. కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల మార్పు ఈసీ ఆదేశాల ప్రకారం జరగాలి.. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు వంటి 17 నియోజకవర్గాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫారం -6, ఫారం -7 విషయంలో నోటీసులు ఇవ్వకుండా మార్పులు చేస్తే బీఎల్ఓలను బాధ్యులు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు.. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చారు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓ వేరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లు తొలగిస్తున్నారు.. ఎమ్మార్వో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓట్లు తొలగిస్తున్నారు.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!