TDP: మంత్రి ధర్మానపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవచ్చు అంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ.. ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీకి చెందిన నాయకులు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని.. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఎన్నికల సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఈసీ స్పష్టం చేయాలి.. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో ఎన్నికల సంఘాన్ని కోరారు అచ్చెన్నాయుడు.
Read Also: Sreeshanth : ఎన్టీఆర్ తో నటించాలని వుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీం ఇండియా మాజీ క్రికెటర్..
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
కాగా, శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ సేవలకు పురస్కారాల ప్రదానోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. వాలంటీర్ కూడా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉంది. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో , ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక, ఏ వృద్దుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్న ఆయన.. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఉంది, దానిని వినియోగించమని చెప్పండి. మీరే దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయండి అని సూచించారు. వాలంటీర్ కి సర్వీస్ రూల్స్ ఏం లేవని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వాలంటీర్ ఏజెంట్ గా కూర్చోవలసి ఉంటుందన్నారు ధర్మాన. ఏరకమైన ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు అని అభివర్ణించిన ఆయన.. ఏ వృత్తి అయినా పదిమంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందన్నారు. అయితే, ధర్మాన కామెంట్లపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ.. ఆ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!