TDP: మంత్రి ధర్మానపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవచ్చు అంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ.. ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీకి చెందిన నాయకులు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని.. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఎన్నికల సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఈసీ స్పష్టం చేయాలి.. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో ఎన్నికల సంఘాన్ని కోరారు అచ్చెన్నాయుడు.
Read Also: Sreeshanth : ఎన్టీఆర్ తో నటించాలని వుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీం ఇండియా మాజీ క్రికెటర్..
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
కాగా, శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ సేవలకు పురస్కారాల ప్రదానోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. వాలంటీర్ కూడా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉంది. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో , ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక, ఏ వృద్దుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్న ఆయన.. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఉంది, దానిని వినియోగించమని చెప్పండి. మీరే దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయండి అని సూచించారు. వాలంటీర్ కి సర్వీస్ రూల్స్ ఏం లేవని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వాలంటీర్ ఏజెంట్ గా కూర్చోవలసి ఉంటుందన్నారు ధర్మాన. ఏరకమైన ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు అని అభివర్ణించిన ఆయన.. ఏ వృత్తి అయినా పదిమంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందన్నారు. అయితే, ధర్మాన కామెంట్లపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ.. ఆ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?