Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Atal Bihari Vajpayee Memorial Lecture Program Union Minister Kishan Reddy Participated

Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..

NTV Telugu Twitter
Published Date :December 24, 2024 , 6:53 pm
By Rajesh Veeramalla
  • ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం
  • పాల్గొన్న రాజ్యసభ ఎంపి సుధాన్ష్ త్రివేది, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు
  • వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది- కిషన్ రెడ్డి
  • వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూశాను- కిషన్ రెడ్డి.
Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాజ్ పేయి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే వరకు బాగోగులు చూసుకునే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూశానని కిషన్ రెడ్డి చెప్పారు.

Read Also: America: క్రిస్మస్ వేళ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. అన్ని విమానాలు రద్దు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వాజ్ పేయి వచ్చారు.. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు యువ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్నానని కిషన్ రెడ్డి చెప్పారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని వాజ్ పేయ్‌ని అనేకసార్లు కలిశానని పేర్కొన్నారు. వాజ్ పేయి ఉపన్యాసం కవితాత్మకంగా ఉండేదని తెలిపారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి అని కిషన్ రెడ్డి తెలిపారు. నైతిక విలువలకు కట్టుబడిన వాజ్ పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయారు.. అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు.

Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

వాజ్ పేయి జాతీయ రహదారుల రూపకల్పన చేశారు.. వాజ్ పేయ్ స్ఫూర్తితో అమెరికా రోడ్లను తలదన్నేలా మోడీ అభివృద్ది చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ది జరుగుతుందని విశ్వసించారు.. అందరి ఆమోదయోగ్యంతో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారన్నారు. వాజ్ పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించిన ఏకైక ప్రధాని వాజ్ పేయి అని.. తన జీవితాన్ని జాతీయ భావ సిద్ధాంతానికి అంకితం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atal Bihari Vajpayee memorial lecture program
  • hyderabad
  • Kishan Reddy
  • participate
  • telugu news

తాజావార్తలు

  • Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ

  • Starlink : భారత్‌లో స్టార్‌లింక్‌కి గ్రీన్‌సిగ్నల్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్‌ సేవలు..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • MLA Chandrasekhar: మీ హయాంలో మీ నాయకుడి సినిమానే వాయిదా వేసుకునే పరిస్థితి..

  • Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!

ట్రెండింగ్‌

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • OnePlus Pad 3 Launch: అల్ట్రా స్లిమ్ డిజైన్‌, 12140mAh భారీ బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ 3 లాంచ్..!

  • OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన వన్‌ప్లస్ 13s..!

  • Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

  • Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions