Teacher Harassment: రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకం..
- పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులను చితకబాదిన టీచర్
- అపస్మార స్థితికి వెళ్లిన ఓ విద్యార్థి
- గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో ఘటన
- ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
ఈ ఘటన ఖోరాబార్ బ్లాక్లోని సెకండరీ స్కూల్లో చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థినులను రెండు జడలు వేసుకురాలేదని ప్రధానోపాధ్యాయురాలు అభా దూబే దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బీఈవో వీకే రాయ్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినుల నుంచి సమాచారం తీసుకున్నారు. విద్యార్థులందరూ తమకు ఎదురైన కష్టాలను వివరించారు. మేడమ్ క్లాస్కి వచ్చిన వెంటనే విద్యార్థుల బ్రెయిడ్లను తనిఖీ చేయడం ప్రారంభించిందని విద్యార్థులు చెప్పారు. ఈ సమయంలో.. రెండు జడలు వేసుకుని రాని విద్యార్థినుల జడలు పట్టుకుని కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఓ విద్యార్థినిని అతి దారుణంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. ఇది చూసి తాము భయంతో కేకలు వేశామన్నారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. వారు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారు.
Read Also: Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష..
మరోవైపు.. ప్రధానోపాధ్యాయురాలిపై బీఎస్ఏ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమెపై విచారణ పూర్తయిందని, ఆరోపణలన్నీ ధృవీకరించిన తర్వాత ఆమె దోషిగా తేలిందని బీఎస్ఏ రామేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు సర్వీసు సస్పెండ్ కాగా.. ఆమెను బీఆర్సీ ఖోరాబర్కు అటాచ్ చేశారు. అంతే కాకుండా.. ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!