Teacher Harassment: రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకం..
- పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులను చితకబాదిన టీచర్
- అపస్మార స్థితికి వెళ్లిన ఓ విద్యార్థి
- గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో ఘటన
- ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ ఘటన ఖోరాబార్ బ్లాక్లోని సెకండరీ స్కూల్లో చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థినులను రెండు జడలు వేసుకురాలేదని ప్రధానోపాధ్యాయురాలు అభా దూబే దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బీఈవో వీకే రాయ్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినుల నుంచి సమాచారం తీసుకున్నారు. విద్యార్థులందరూ తమకు ఎదురైన కష్టాలను వివరించారు. మేడమ్ క్లాస్కి వచ్చిన వెంటనే విద్యార్థుల బ్రెయిడ్లను తనిఖీ చేయడం ప్రారంభించిందని విద్యార్థులు చెప్పారు. ఈ సమయంలో.. రెండు జడలు వేసుకుని రాని విద్యార్థినుల జడలు పట్టుకుని కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఓ విద్యార్థినిని అతి దారుణంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. ఇది చూసి తాము భయంతో కేకలు వేశామన్నారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. వారు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారు.
Read Also: Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష..
మరోవైపు.. ప్రధానోపాధ్యాయురాలిపై బీఎస్ఏ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమెపై విచారణ పూర్తయిందని, ఆరోపణలన్నీ ధృవీకరించిన తర్వాత ఆమె దోషిగా తేలిందని బీఎస్ఏ రామేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు సర్వీసు సస్పెండ్ కాగా.. ఆమెను బీఆర్సీ ఖోరాబర్కు అటాచ్ చేశారు. అంతే కాకుండా.. ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!