Teacher Harassment: రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకం..
- పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులను చితకబాదిన టీచర్
- అపస్మార స్థితికి వెళ్లిన ఓ విద్యార్థి
- గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో ఘటన
- ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్పూర్లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ఈ ఘటన ఖోరాబార్ బ్లాక్లోని సెకండరీ స్కూల్లో చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థినులను రెండు జడలు వేసుకురాలేదని ప్రధానోపాధ్యాయురాలు అభా దూబే దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బీఈవో వీకే రాయ్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినుల నుంచి సమాచారం తీసుకున్నారు. విద్యార్థులందరూ తమకు ఎదురైన కష్టాలను వివరించారు. మేడమ్ క్లాస్కి వచ్చిన వెంటనే విద్యార్థుల బ్రెయిడ్లను తనిఖీ చేయడం ప్రారంభించిందని విద్యార్థులు చెప్పారు. ఈ సమయంలో.. రెండు జడలు వేసుకుని రాని విద్యార్థినుల జడలు పట్టుకుని కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఓ విద్యార్థినిని అతి దారుణంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. ఇది చూసి తాము భయంతో కేకలు వేశామన్నారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. వారు పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారు.
Read Also: Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష..
మరోవైపు.. ప్రధానోపాధ్యాయురాలిపై బీఎస్ఏ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆమెపై విచారణ పూర్తయిందని, ఆరోపణలన్నీ ధృవీకరించిన తర్వాత ఆమె దోషిగా తేలిందని బీఎస్ఏ రామేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు సర్వీసు సస్పెండ్ కాగా.. ఆమెను బీఆర్సీ ఖోరాబర్కు అటాచ్ చేశారు. అంతే కాకుండా.. ఆమెపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!