Islamabad Meeting: ఇస్లామాబాద్ సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamabad Meeting: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించడానికి తాలిబన్ చైనా, పాకిస్తాన్తో అంగీకరించింది. ఆంక్షలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి బిలియన్ల డాలర్లు సమకూరే అవకాశం ఉంది. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ శనివారం ఇస్లామాబాద్లో సమావేశమయ్యారు. తాలిబాన్ పాలిత దేశానికి 60 బిలియన్ల డాలర్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను తీసుకెళ్లడంతో సహా ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణ ప్రక్రియపై కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
“ఆఫ్ఘనిస్థాన్కు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పొడిగింపుతో సహా ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి సహకారాన్ని మెరుగుపరచడానికి, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు వారి మానవతా, ఆర్థిక సహాయాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి” అని సమావేశం తరువాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపింది. దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రారంభమైన ప్రెసిడెంట్ జి జిన్పింగ్ ఫ్లాగ్షిప్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద నిర్మించిన ప్రాజెక్ట్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించడం గురించి చైనా, పాకిస్తాన్ అధికారులు గతంలో చర్చించారు. నగదు కొరతతో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లో పాల్గొనడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. అవసరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడిని పొందే అవకాశం ఉంది. తాలిబాన్ అగ్ర దౌత్యవేత్త అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇస్లామాబాద్కు వెళ్లి తన చైనా, పాకిస్థానీ ప్రత్యర్ధులను కలుసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన డిప్యూటీ ప్రతినిధి హఫీజ్ జియా అహ్మద్ ఫోన్ ద్వారా తెలిపారు. చైనా దేశంలో పెట్టుబడులు పెడుతుందని తాలిబాన్ సర్కారు ఆశలు పెట్టుకుంది. ఉత్తర అము దర్యా బేసిన్ నుండి చమురును తీయడానికి చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ అనుబంధ సంస్థతో తాలిబాన్ ప్రభుత్వం జనవరిలో తన మొదటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
Read Also: Mark Zuckerberg: మొదటి టోర్నమెంటే.. కానీ బంగారు, రజతాలను గెలిచేశాడు..
ఆఫ్ఘనిస్తాన్ విదేశీ ఆర్థిక ఆస్తులను స్తంభింపజేయాల్సిన అవసరాన్ని చైనా, పాకిస్తాన్ మంత్రులు కూడా నొక్కి చెప్పారు. ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తారనే ఆందోళనతో విదేశాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్లలో సుమారు 9 బిలియన్ డాలర్లను యాక్సెస్ చేయకుండా తాలిబాన్ నిరోధించబడింది. 2021లో అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత అంతర్జాతీయ సహాయం నిలిపివేయబడింది. ప్రస్తుతం పాలిస్తు్న్న తాలిబన్ సర్కారు నగదు కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిష్కరించడానికి పెట్టుబడులను ఒక మార్గంగా చూస్తారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, ఇరాన్లు తాలిబాన్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే కొన్ని దేశాలలో ఉన్నాయి. వారు తాలిబాన్కు పదిలక్షల డాలర్ల సాయం అందించారు, అయితే ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకుండా ఆగిపోయారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!