బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది..
ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను చేశాడు. శివాజీ… అమర్ దీప్, తేజాలను చేశాడు. రతిక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాలను చేసింది. తేజ… అర్జున్, రతికలను నామినేట్ చేశారు. భోలే… ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు… ఆ తర్వాత ఈరోజు నామినేషన్స్ లో యావర్ రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో యావర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు. కాగా యావర్ అశ్వినిని నామినేట్ చేయగా ఆమె కూడా తిరిగి నామినేట్ చేసింది.
కాసేపు వీరిద్దరి మధ్య వాగ్వాధం చోటు చేసుకుంది.. దీంతో ఇద్దరు తగ్గలేదు.. నువ్వు నన్ను గెలికావు, అందుకే నిన్ను నేను గెలుకుతున్నా అని అశ్విని అనడంతో… యావర్ మరింత రెచ్చిపోయాడు. హా గెలుకు అది నాకు బాగా ఇష్టం అన్నాడు.. అలా కాసేపు రెచ్చిపోయారు.. ఈరోజు కూడా నామినేషన్స్ ముగియనున్నాయి. ఎవరు నామినేట్ అయ్యారో బిగ్ బాస్ తెలియజేస్తాడు… ఈవారం అమర్, ప్రియాంక, శోభా, తేజ, భోలే, యావర్, రతిక, అర్జున్ నామినేట్ అయినట్లు తెలుస్తుంది..