Himanta Biswa Sarma: కేవలం మీడియా హైప్ కోసమే.. రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు. జాతి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటన గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ..”కేవలం మీడియా హైప్” అని అభివర్ణించారు. మణిపూర్ పరిస్థితిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, రాహుల్ గాంధీ వంటి పగటిపూట పర్యటనల వల్ల ఎటువంటి సానుకూల ఫలితం ఉండదని శర్మ అన్నారు.
Also Read: Bihar: బీహార్లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆర్జేడీ పనే అంటున్న బీజేపీ
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
రాహుల్ గాంధీ మణిపూర్లో కేవలం ఒక రోజు మాత్రమే సందర్శిస్తున్నారని.. ఇది మీడియా ప్రచారం తప్ప మరొకటి కాదన్నారు. పర్యటన నుంచి సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే, అది వేరే విషయమన్నారు. కానీ అలాంటి పర్యటన నుంచి ఎటువంటి ఫలితం ఉండదన్నారు. మణిపూర్ విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవద్దని అన్నారు. ట్విటర్లో అసోం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “మణిపూర్లోని పరిస్థితి కరుణ ద్వారా విభేదాలను తగ్గించాలని కోరుతోంది. ఒక రాజకీయ నాయకుడు తన పర్యటన అని పిలవబడే లోపాలను మరింత తీవ్రతరం చేయడానికి ఉపయోగించడం దేశానికి ప్రయోజనం కలిగించదు.” అని మండిపడ్డారు. రాష్ట్రంలోని రెండు సంఘాలు ఇటువంటి ప్రయత్నాలను స్పష్టంగా తిరస్కరించాయన్నారు.
Also Read: Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. బాష్పవాయువును ప్రయోగించిన భద్రత దళాలు
కాంగ్రెస్ మాజీ చీఫ్ కాన్వాయ్ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకోవడంతో మణిపూర్లో గురువారం రాహుల్ గాంధీ చురాచంద్పూర్లోని సహాయ శిబిరాలను సందర్శించడంపై హై డ్రామా నెలకొంది. ఆ తర్వాత హెలికాప్టర్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ కాన్వాయ్ను అడ్డుకోవడంతో రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు, ఆయన పర్యటనను వివిధ వర్గాల నుంచి వ్యతిరేకించడంతో హెలికాప్టర్తో వెళ్లాలని సూచించినప్పటికీ, ఆయన మొండిగా వ్యవహరిస్తూ రోడ్డు యాత్రను ఎంచుకున్నారని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!