Himanta Biswa Sarma: కేవలం మీడియా హైప్ కోసమే.. రాహుల్ మణిపూర్ పర్యటనపై అసోం సీఎం ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు. జాతి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటన గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ..”కేవలం మీడియా హైప్” అని అభివర్ణించారు. మణిపూర్ పరిస్థితిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, రాహుల్ గాంధీ వంటి పగటిపూట పర్యటనల వల్ల ఎటువంటి సానుకూల ఫలితం ఉండదని శర్మ అన్నారు.
Also Read: Bihar: బీహార్లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆర్జేడీ పనే అంటున్న బీజేపీ
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
రాహుల్ గాంధీ మణిపూర్లో కేవలం ఒక రోజు మాత్రమే సందర్శిస్తున్నారని.. ఇది మీడియా ప్రచారం తప్ప మరొకటి కాదన్నారు. పర్యటన నుంచి సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే, అది వేరే విషయమన్నారు. కానీ అలాంటి పర్యటన నుంచి ఎటువంటి ఫలితం ఉండదన్నారు. మణిపూర్ విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవద్దని అన్నారు. ట్విటర్లో అసోం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “మణిపూర్లోని పరిస్థితి కరుణ ద్వారా విభేదాలను తగ్గించాలని కోరుతోంది. ఒక రాజకీయ నాయకుడు తన పర్యటన అని పిలవబడే లోపాలను మరింత తీవ్రతరం చేయడానికి ఉపయోగించడం దేశానికి ప్రయోజనం కలిగించదు.” అని మండిపడ్డారు. రాష్ట్రంలోని రెండు సంఘాలు ఇటువంటి ప్రయత్నాలను స్పష్టంగా తిరస్కరించాయన్నారు.
Also Read: Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. బాష్పవాయువును ప్రయోగించిన భద్రత దళాలు
కాంగ్రెస్ మాజీ చీఫ్ కాన్వాయ్ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకోవడంతో మణిపూర్లో గురువారం రాహుల్ గాంధీ చురాచంద్పూర్లోని సహాయ శిబిరాలను సందర్శించడంపై హై డ్రామా నెలకొంది. ఆ తర్వాత హెలికాప్టర్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ కాన్వాయ్ను అడ్డుకోవడంతో రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు, ఆయన పర్యటనను వివిధ వర్గాల నుంచి వ్యతిరేకించడంతో హెలికాప్టర్తో వెళ్లాలని సూచించినప్పటికీ, ఆయన మొండిగా వ్యవహరిస్తూ రోడ్డు యాత్రను ఎంచుకున్నారని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!