Assam : అస్సాంలో ఆయుధాలతో లొంగిపోయిన 39 మంది తీవ్రవాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam : ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు శుక్రవారం నాడు హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం ముందు అస్సాం రైఫిల్స్, బొకాజన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. ‘ఆపరేషన్ సమర్పన్’ కింద 3 AK సిరీస్ రైఫిల్స్, 19 పిస్టల్స్, 5 ఇతర రైఫిల్స్, రెండు గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రితో సహా మొత్తం 31 ఆయుధాలను APLA క్రియాశీల కార్యకర్తలు లొంగిపోయినట్లు సమాచారం.
అస్సాం పోలీసుల సహకారంతో ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (నార్త్) , స్పియర్ కార్ప్స్ చేసిన ప్రయత్నాల కారణంగా ఈ సిబ్బంది నేడు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. అంతకుముందు మే 26న, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కెసిపి)-పీపుల్స్ వార్ గ్రూప్కు చెందిన ఐదుగురు కార్యకర్తలు మణిపూర్లోని సోమసాయి, ఉఖ్రుల్లో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు.
Also Read
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
Read Also:Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయింది..?
యువత ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు అస్సాం రైఫిల్స్ చెబుతోంది. ఈ నిర్ణయం తప్పు మార్గాన్ని ఎంచుకున్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. లొంగిపోయిన కార్యకర్తల కుటుంబాలు.. తమ వారిని సురక్షితంగా తమ కుటుంబాలకు తిరిగి అప్పగించినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also:Human Bodies: మెక్సికోలో భయానకం.. 45బ్యాగుల్లో మానవ శరీర భాగాలు
APLA చీఫ్ సాహిల్ ముండా లొంగిపోయారు. దాదాపు 125 మంది సభ్యులతో ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (ANLA) ప్రత్యేక విభాగంగా 2019లో తన గ్రూప్ ఏర్పడిందని ఆయన చెప్పారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఏఎన్ఎల్ఏకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని చూసిన తర్వాత మళ్లీ జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. సంస్థలోని దాదాపు 40 మంది సభ్యులు ఇంకా తమ ఆయుధాలు వదులుకోవలసి ఉండగా, చాలా మంది జైల్లోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!