Assam : అస్సాంలో ఆయుధాలతో లొంగిపోయిన 39 మంది తీవ్రవాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam : ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు శుక్రవారం నాడు హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం ముందు అస్సాం రైఫిల్స్, బొకాజన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. ‘ఆపరేషన్ సమర్పన్’ కింద 3 AK సిరీస్ రైఫిల్స్, 19 పిస్టల్స్, 5 ఇతర రైఫిల్స్, రెండు గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రితో సహా మొత్తం 31 ఆయుధాలను APLA క్రియాశీల కార్యకర్తలు లొంగిపోయినట్లు సమాచారం.
అస్సాం పోలీసుల సహకారంతో ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (నార్త్) , స్పియర్ కార్ప్స్ చేసిన ప్రయత్నాల కారణంగా ఈ సిబ్బంది నేడు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. అంతకుముందు మే 26న, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కెసిపి)-పీపుల్స్ వార్ గ్రూప్కు చెందిన ఐదుగురు కార్యకర్తలు మణిపూర్లోని సోమసాయి, ఉఖ్రుల్లో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
Read Also:Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయింది..?
యువత ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు అస్సాం రైఫిల్స్ చెబుతోంది. ఈ నిర్ణయం తప్పు మార్గాన్ని ఎంచుకున్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. లొంగిపోయిన కార్యకర్తల కుటుంబాలు.. తమ వారిని సురక్షితంగా తమ కుటుంబాలకు తిరిగి అప్పగించినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also:Human Bodies: మెక్సికోలో భయానకం.. 45బ్యాగుల్లో మానవ శరీర భాగాలు
APLA చీఫ్ సాహిల్ ముండా లొంగిపోయారు. దాదాపు 125 మంది సభ్యులతో ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (ANLA) ప్రత్యేక విభాగంగా 2019లో తన గ్రూప్ ఏర్పడిందని ఆయన చెప్పారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఏఎన్ఎల్ఏకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని చూసిన తర్వాత మళ్లీ జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. సంస్థలోని దాదాపు 40 మంది సభ్యులు ఇంకా తమ ఆయుధాలు వదులుకోవలసి ఉండగా, చాలా మంది జైల్లోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!