Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్కి గురిచేసిన సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఆర్యన్పై మాదకద్రవ్యాల కేసు, ఆ తరువాత “బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”లో ఆయన పాత్ర చుట్టూ ఉన్న వివాదం, ఇప్పుడు వైరల్ అయిన వీడియో తనని మళ్లీ ఇబ్బందుల్లో పడేసింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఇది నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. ఏకంగా ఇప్పుడు ఈ వీడియోపై ఒక న్యాయవాది ఆర్యన్పై ఫిర్యాదు చేసే స్థాయికి చేరుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
బెంగళూరులోని ఒక పబ్లో ఆర్యన్ ఖాన్ జనసమూహం ముందు మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ వీడియో ప్రజల ఆగ్రహానికి దారితీసింది. దీంతో బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఆర్యన్ ఖాన్పై ఫిర్యాదు నమోదైంది. పలు నివేదికల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సాంకీ రోడ్ నివాసి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఒవైజ్ హుస్సేన్ ఎస్.. బహిరంగంగా అశ్లీల చర్యలకు పాల్పడినందుకు ఆర్యన్ ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్, డీసీపీ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు.
ఆర్యన్ ఖాన్ ఈ సంజ్ఞ చేసినప్పుడు పబ్లో చాలా మంది మహిళలు ఉన్నారని హుస్సేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది మహిళలను అవమానించడమేనని, భారత శిక్షాస్మృతి (IPC) నిబంధనల పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఈ సంజ్ఞ అనేది ప్రజలకు అసౌకర్యం, ఇబ్బంది, మానసిక క్షోభను కలిగించిందని న్యాయవాది తన ఫిర్యాదులో తెలిపాడు. ఇది బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు. న్యాయవాది ఓవైస్ హుస్సేన్ ఎస్ ఫిర్యాదుపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేక్ అక్షయ్ మచ్చింద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియా పోస్ట్, తమకు అందిన పబ్ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
READ ALSO: Pakistan – Afghanistan: ఆ రెండు ముస్లిం దేశాల మధ్య ఆగని పోరు..
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!