Arvind Kejriwal: ఛత్తీస్గఢ్కు అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఛత్తీస్గఢ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్గఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ను ఉచితంగా అందిస్తామని ఆప్ హామీలు కురిపించింది. మహిళలకు నెలవారీ `సమ్మాన్ రాశి’, నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి సహా పది హామీలు ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఢిల్లీ, పంజాబ్లలో తమ పార్టీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాయని, ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వస్తే అదే పని చేస్తామని చెప్పారు.
ఆప్ హామీలివే..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
*10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు
*24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
*ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితం
*నవంబర్ 2023 వరకు పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీ
*18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ రూ.1,000 ‘సమ్మన్ రాశి’ (గౌరవ వేతనం)
*పిల్లలందరికి ఉచిత విద్య
*ఢిల్లీ తరహాలో ఛత్తీస్గఢ్లోని ప్రతి పౌరునికి ఉచిత, మెరుగైన ఆరోగ్య చికిత్స
*ప్రతి గ్రామం, నగరాల్లోని వార్డులలో మొహల్లా క్లినిక్లు
*నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి
*సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర,
*విధి నిర్వహణలో అమరులైన రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్ల (ఛత్తీస్గఢ్కు చెందినవారు) కుటుంబాలకు రూ. కోటి అందజేత
*కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్
తదుపరి హామీలు రైతులకు, గిరిజనులకు సంబంధించినదేనని అయితే తదుపరి పర్యటనలో వెల్లడిస్తానని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నారు.అరవింద్ కేజ్రీవాల్ గత నెలలో బిలాస్పూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. మార్చిలో రాయ్పూర్లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సుకు ఆయన హాజరయ్యారు. 2018లో ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 90 స్థానాలకు 85 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, కానీ విజయం సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!