Kejriwal: బెయిల్పై హైకోర్టులో లభించని ఊరట.. జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్
- బెయిల్పై హైకోర్టులో లభించని ఊరట
- ఈడీ వాదనను సమర్థించిన న్యాయస్థానం
- దీంతో మరిన్ని రోజులు జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్
- బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్, ఆప్ నేతలకు భంగపాటు ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది. కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఢిల్లీ కోర్టు సరైన మైండ్ ఉపయోగించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్పై ఈడీ అభ్యంతరానికి హైకోర్టు సమ్మతి తెలిపింది. దీంతో మరిన్ని రోజులు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింంది. ఇదిలా ఉంటే బుధవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Fire Accident: జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు గత వారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యేందుకు కేజ్రీవాల్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఇంకోవైపు ఆప్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ఈడీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మూడు రోజుల పాటు విడుదలను పెండింగ్లో పెట్టింది. ఈడీ పిటిషన్పై మంగళవారం ధర్మాసనం విచారించి.. బెయిల్పై స్టే కొనసాగించింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కేజ్రీవాల్ మరిన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Funny Answers : మరో జాతిరత్నం దొరికేసాడు.. ప్రశ్నలకు సమాధానాలు చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. మధ్యలో లోక్సభ సార్వత్రిక ఎన్నికల రావడంతో 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Piyush Goyal: ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నుకుంటే…(వీడియో)
తాజావార్తలు
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?