ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పుపై ఆప్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ధర్మాసనం ఏం తీర్పు వెలువరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే మంగళవారం బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు.
ఇది కూడా చదవండి: Baba Ramdev: సుప్రీంకోర్టుకు బాబా రామ్దేవ్ బేషరతుగా క్షమాపణలు
మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. మంగళవారం కొట్టేసింది. తాజాగా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. బెయిల్పై ఆప్ నేతలు గంపెడాశలు పెట్టుకుంది. ఓ వైపు పోలింగ్ సమయం ముంచుకొస్తోంది. ఇంకోవైపు నేతలంతా కేజ్రీవాల్ బెయిల్ కోసమే సమయం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Israel: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీడియో విడుదల
